ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా(Prakasam District) మార్కాపురం నియోజకవర్గం గిద్దలూరు మండలం దంతరపల్లె గ్రామంలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 53 ఏళ్ల హరి అనే వ్యక్తి మద్యం సేవనానికి బానిసగా మారి, మత్తులో తరచూ ఇంట్లో గొడవలు సృష్టించేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. భార్యను మాటలతోనే కాదు, ప్రవర్తనతో కూడా వేధించేవాడని సమాచారం.
Read also: Hyd Crime: టోలీచౌకిలో రోడ్డు ప్రమాదం.. డెలివరీ బాయ్ దుర్మరణం

ఘటన జరిగిన రోజున కూడా హరి మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో ఘర్షణకు దిగాడు. ఈ గొడవ క్రమంగా తీవ్రస్థాయికి చేరుకోవడంతో, సంవత్సరాలుగా కొనసాగుతున్న వేధింపులు, మానసిక ఒత్తిడితో సహనం కోల్పోయిన భార్య, తన కుమార్తెల సహాయంతో బలమైన వస్తువుతో హరి తలపై దాడి చేసింది. తలకు బలమైన గాయం కావడంతో హరి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల చర్యలు
ఘటన స్థలానికి చేరుకున్న(Prakasam District) పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్యతో పాటు కుమార్తెలను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మద్యం అలవాటు, కుటుంబ వివాదాలే ఈ దారుణానికి కారణమా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన మద్యం దుష్ప్రభావాలు కుటుంబాలను ఎలా విచ్ఛిన్నం చేస్తున్నాయనే అంశంపై గ్రామంలో చర్చకు దారి తీసింది. మద్యం వల్ల జరిగే గృహహింసను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: