News Telugu: Pinnelli Ramakrishna Reddy: సుప్రీంకోర్టులో పిన్నెల్లి సోదరులకు దొరకని ఊరట

Read Time:  1 min
సుప్రీంకోర్టులో పిన్నెల్లి సోదరులకు దొరకని ఊరట
సుప్రీంకోర్టులో పిన్నెల్లి సోదరులకు దొరకని ఊరట
FONT SIZE
GET APP

సుప్రీంకోర్టు (supreme court) లో పిన్నెల్లి సోదరులకు దొరకని ఊరట పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డ ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సర్వోన్నత న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది. ఈరోజు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఇరపక్షాల వాదనలను విన్నది. అనంతరం తదుపరి విచారణను రెండువారాల తర్వాత జరుపుతామని స్పష్టం చేసింది.

Read also: Kadapa Crime: 9 వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తత

సుప్రీంకోర్టులో పిన్నెల్లి సోదరులకు దొరకని ఊరట

సుప్రీంకోర్టులో పిన్నెల్లి సోదరులకు దొరకని ఊరట

బెయిల్ లభిస్తుందని ఆశించిన సోదరులు

నేటి విచారణలో తమకు కచ్చితంగా బెయిల్ లభిస్తుందని ఆశించిన పిన్నెల్లి సోదరులకు ఈ పరిణామం నిరాశ కలిగించింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మే 25న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చారు. అందరిపైనా ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.