Maoist Movement: వరుస ఎన్కౌంటర్లు, ముఖ్య నేతల లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఉద్యమం క్రమంగా క్షీణిస్తోంది. 2021లో అగ్ర నేత ఆర్కే మరణంతో ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత హిడ్మా, నంబాల కేశవరావు వంటి కీలక నాయకులు భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యారు.
Read Also:Operation Kagar: మావోయిస్టు టాప్ కమాండర్ దేవ్జీ లొంగింపు

నేతల సరెండర్లు, పారిపోయిన గణపతి
మల్లోజుల, ఆశన్న, దేవ్జీ, రాజిరెడ్డి వంటి నాయకులు ఇటీవల లొంగిపోవడంతో మావోయిస్టు నెట్వర్క్ మరింత బలహీనమైంది. పార్టీ స్థాపక నేత గణపతి విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. మరో కీలక నేత బడే చొక్కారావు కోసం భద్రతా దళాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం అడవుల్లో మిగిలిన మావోయిస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: