Latest News: Mandideep: మధ్యప్రదేశ్‌లో రోడ్డు క్రుంగిపోయి కలకలం

Read Time:  1 min
Mandideep
Mandideep
FONT SIZE
GET APP

మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య మధ్యప్రదేశ్‌లోని మాండీదీప్(Mandideep)–ఇట్‌ఖేడి వంతెన దగ్గర భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 100 మీటర్ల రోడ్డు ఒక్కసారిగా కూలిపోయింది, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.మొదట ఈ రహదారి NHAI పరిధిలోదేనా అన్న సందేహం తలెత్తింది. అయితే NHA(National Highways Authority of India) అధికారులు స్పష్టం చేస్తూ, “ఈ రోడ్డు మా పరిధిలో లేదు, ఇది MPRDC పరిధిలోకే వస్తుంది” అని తెలిపారు.

Read also:  Kiran Mazumdar Shaw: దేశ మౌలిక వసతులపై షా వ్యాఖ్యలు

Mandideep

మంత్రి వ్యాఖ్యలు, దర్యాప్తు ప్రారంభం

Mandideep: ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రజా పనుల శాఖ మంత్రి రాకేష్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.అతను, “రోడ్డు అంటే గుంతలు కామన్. నాలుగేళ్లు నిలవాల్సిన రోడ్డు ఆరునెలల్లో పాడైతేనే ఆందోళన చెందాలి,” అని అన్నారు.ప్రాథమిక సమాచారం ప్రకారం, RE గోడ కూలిపోవడం వలన ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.


దర్యాప్తు బృందం ఏర్పాటు చేయగా, తుది నివేదిక వెలువడిన తర్వాత నిజమైన కారణం తెలిసే అవకాశం ఉందని MPRDC మేనేజర్ సోనాల్ సిన్హా తెలిపారు. ఈ వంతెన 2013లో నిర్మించబడింది, కానీ ట్రాన్స్‌స్ట్రాయ్ ప్రైవేట్ లిమిటెడ్ టెండర్‌ను 2020లో రద్దు చేశారు. అప్పటి నుండి ఈ మార్గాన్ని పర్యవేక్షించే ఏ సంస్థా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Radha

రచయిత గురించి

Radha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.