పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల మధ్య అమెరికా తన వ్యూహాన్ని మార్చుకుంది. ఇరాన్ కు ఆర్థిక వెన్నెముకగా భావించే ఖర్గ్ ద్వీపాన్ని (Kharg Island) ఆక్రమించుకోవడానికి లేదా పూర్తిగా దిగ్బంధించడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఈ వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్ ఇప్పటికే ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడంతో.. ఆ మార్గాన్ని తిరిగి తెరిపించేందుకు, టెహ్రాన్పై గరిష్ట ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ఈ ‘ఖర్గ్ ఆపరేషన్’ను ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకోవాలని యోచిస్తోంది. వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ స్పష్టం చేసినట్లుగా.. అధ్యక్షుడు ఆదేశిస్తే అమెరికా సైన్యం ఎప్పుడైనా ఈ ద్వీపాన్ని తన ఆధీనంలోకి తీసుకోగలదని తెలుస్తోంది. ఖర్గ్ ద్వీపం అనేది ఇరాన్ ముడి చమురు ఎగుమతులలో దాదాపు అన్నింటినీ నిర్వహించే అతిముఖ్యమైన కేంద్రం.
Read Also: Air India, AI 185: 8 గంటల గాలిలో ప్రయాణం.. చివరకు ఢిల్లీలోనే ల్యాండింగ్

Kharg Island: ఆ ద్వీపంలోని మిగిలిన మౌలిక సదుపాయాలపై కూడా దాడులు
దీనిని ట్రంప్ రక్షణ లేని ఒక చిన్న చమురు ద్వీపంగా అభివర్ణించడమే కాకుండా, ఇప్పటికే అక్కడ ఉన్న సైనిక లక్ష్యాలను అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని ప్రకటించారు. కేవలం చమురు పైపులు మినహా మిగిలిన అన్ని రక్షణ వ్యవస్థలను తుడిచిపెట్టేయడం ద్వారా.. ఇరాన్ తన ప్రధాన ఆదాయ వనరును కాపాడుకోలేని స్థితికి చేరుకుందని అమెరికా సంకేతాలిస్తోంది. ఒకవేళ ఇరాన్ తన పంతాన్ని వీడక హార్ముజ్ జలసంధిని అడ్డుకోవడం కొనసాగిస్తే.. ఆ ద్వీపంలోని మిగిలిన మౌలిక సదుపాయాలపై కూడా దాడులు తప్పవని ట్రంప్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామాలు కేవలం వైమానిక దాడులకే పరిమితం కాకుండా.. ఒక భూతల ఆపరేషన్కు (Ground Operation) దారితీసేలా కనిపిస్తున్నాయి. అమెరికా ఇప్పటికే మధ్యప్రాచ్యానికి అదనపు మెరైన్లను పంపడం, సముద్రంలో ఇరాన్ వేసిన 40కి పైగా మందుపాతరలను ధ్వంసం చేయడం ఈ వ్యూహంలో భాగమే.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :