ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కొత్త తరహా సైబర్(Cyber) మోసం వెలుగులోకి వచ్చింది. ఒక సూపర్మార్కెట్ యజమానికి క్యూఆర్ కోడ్ స్కానర్(QR Code)(scanner) ద్వారా వచ్చే డబ్బులు తన ఖాతాలోకి రావడం లేదని అనుమానం కలగడంతో, సీసీ కెమెరా ఫుటేజీని తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది.
Read Also: Sachin Sanghvi: బాలీవుడ్ సింగర్పై మహిళా గాయని ఫిర్యాదు
మోసగాడి కొత్త ట్రిక్
మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కూడా తమ మోసపు ట్రిక్స్ను అప్డేట్ చేసుకుంటున్నారు. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన వెంకన్న ఓ సూపర్మార్కెట్ నడుపుతున్నారు. కస్టమర్లు డిజిటల్ చెల్లింపులు చేయడానికి షాపు ముందు క్యూఆర్ కోడ్ స్కానర్ను ఏర్పాటు చేశారు. ఈనెల 7న గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చి వెంకన్న అకౌంట్కు సంబంధించిన అసలైన క్యూఆర్ కోడ్ స్టిక్కర్ను తీసేసి, తను తీసుకొచ్చిన నకిలీ క్యూఆర్ కోడ్ను అంటించి వెళ్లిపోయాడు.
యజమాని ఫిర్యాదు, పోలీసుల దర్యాప్తు
అప్పటి నుంచి షాపులో కొనుగోలు చేసిన కస్టమర్లు స్కాన్ చేసినప్పటికీ, మొత్తం నగదు ఆ దొంగల ఖాతాకే మళ్లింది. అనుమానం వచ్చిన వెంకన్న సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించగా, ఆ వ్యక్తి క్యూఆర్ స్టిక్కర్ మార్చి పెట్టిన విషయం స్పష్టంగా రికార్డైంది. తీరా డబ్బులు వెళ్తున్న ఖాతా ఒక మహిళ పేరుతో ఉందని గమనించిన వెంకన్న వెంటనే తిరుమలాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై జగదీష్ హెచ్చరించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు దాన్ని పరిశీలించుకోవడం ద్వారా ఇలాంటి మోసాల నుండి తప్పించుకోవచ్చని ఆయన సూచించారు.
ఈ కొత్త తరహా సైబర్ మోసం ఎక్కడ జరిగింది?
ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం, దమ్మాయిగూడెం గ్రామంలోని ఒక సూపర్మార్కెట్లో జరిగింది.
సైబర్ నేరగాడు ఎలా మోసం చేశాడు?
షాపు ముందు ఉన్న అసలైన క్యూఆర్ కోడ్ స్టిక్కర్ను తీసేసి, తన నకిలీ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ను అతికించాడు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: