కర్నూలు దుర్ఘటన తర్వాత కర్ణాటక(Karnataka) ప్రభుత్వం ప్రైవేట్ బస్సుల భద్రతా ప్రమాణాలపై కఠిన చర్యలకు దిగింది. అత్యవసర నిష్క్రమణ ద్వారాలు, అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స పరికరాలు వంటి అంశాలను పరిశీలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు ప్రారంభించింది. రవాణా శాఖ ఆధ్వర్యంలో మొత్తం 12 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, అక్టోబర్ 24 నుండి నవంబర్ 5 వరకు 13 రోజుల పాటు పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా 4,452 ప్రైవేట్ బస్సులను తనిఖీ చేశారు. వాటిలో 604 బస్సులు భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించినట్లు తేలడంతో కేసులు నమోదు చేయగా, 102 బస్సులను స్వాధీనం చేసుకున్నారు.
Read also: Bus Accident: వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ప్రమాదం
భారీ జరిమానాలు – యజమానులకు హెచ్చరికలు
తనిఖీలలో తప్పులు తేలిన బస్సులపై మొత్తం రూ.1.09 కోట్లు జరిమానా వసూలు చేశారు. బస్సుల్లో ప్రయాణీకుల భద్రతకు సంబంధించిన చర్యలను పాటించని యజమానులపై కఠినంగా వ్యవహరించాలని రవాణా శాఖ(Department of Transport) కమిషనర్ ఆదేశించారు. తెలంగాణలోని కర్నూలు ఘటనలో 19 మంది సజీవ దహనమవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సంఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం(Karnataka) మరింత అప్రమత్తమై, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు ప్రారంభించింది.
భవిష్యత్తు చర్యలు
రవాణా శాఖ అధికారులు ఇకపై కూడా నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. భద్రతా ప్రమాణాలను పాటించని ప్రైవేట్ బస్సు యజమానులు కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: