Iran warship attack : హిందూ మహాసముద్రంలో భారీ విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలోని అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఇరాన్ యుద్ధ నౌకపై జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ ఘటనలో దాదాపు ఎనభై మంది నౌక సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
శ్రీలంక విదేశాంగ శాఖ మంత్రి విజిత హెరాత్ వెల్లడించిన వివరాల ప్రకారం, “ఐరిస్ డేనా” అనే ఇరాన్ యుద్ధ నౌకలో సుమారు నూరెంభై మంది సిబ్బంది ఉన్నారు. దాడి జరిగిన వెంటనే నౌక నుంచి ప్రమాద సంకేతాలు అందడంతో శ్రీలంక నౌకాదళం తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించింది.
ఈ ఘటనలో ఎనభై మంది వరకు మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందింది. ఇప్పటివరకు ముప్పై రెండుమందిని సురక్షితంగా రక్షించినట్లు శ్రీలంక నౌకాదళం తెలిపింది. గాయపడిన వారిని గాలే నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారి కోసం సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Read Also: PM Kisan 22nd Installment: పీఎం కిసాన్ లిస్ట్ నుంచి 7 మిలియన్ల పేర్లు తొలగింపు
ఈ యుద్ధ నౌక ఇటీవల భారతదేశంలో జరిగిన (Iran warship attack) అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఫిబ్రవరి నెలలో బంగాళాఖాతంలో జరిగిన ఈ విన్యాసాల అనంతరం స్వదేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ దాడి అంతర్జాతీయ స్థాయిలో మరింత ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ప్రత్యక్షంగా యుద్ధ చర్యలకు దిగడం ప్రపంచ రాజకీయ పరిస్థితులను మరింత క్లిష్టంగా మార్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ ఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా భద్రతా పరిస్థితులపై చర్చలు మరింత వేడెక్కాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ స్థాయిలో మరింత పెద్ద యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: