Latest Telugu News : Rule of Law : ‘రూల్‌ ఆఫ్‌ లా’ ఇండెక్స్‌లో దిగజారిన భారత్‌ ర్యాంకు

Read Time:  1 min
Rule of Law
Rule of Law
FONT SIZE
GET APP

మోదీ పాలనలో దేశం తిరోగమనం చెందుతున్నది. దేశ ప్రగతికి కొలమానంగా నిలిచే పలు అంతర్జాతీయ సూచీల్లో భారత్‌ ర్యాంకు అంతకంతకూ దిగజారుతున్నది. తాజాగా విడుదలైన వరల్డ్‌ జస్టిస్‌ ప్రాజెక్ట్‌ రూల్‌ ఆఫ్‌ లా ఇండెక్స్‌- 2025లో (Rule of Law Index) ఇండియా ర్యాంకు మరింత పతనమైంది. 143 దేశాలకు గానూ గత ఏడాది 79వ స్థానంలో నిలిచిన భారత్‌.. ఈ ఏడాది ఏడు స్థానాలు దిగజారి 86వ ర్యాంకులో నిలిచింది. ప్రభుత్వ అధికారాలపై నియంత్రణలు, అవినీతి రాహిత్యం, ప్రభుత్వ పారదర్శకత, ప్రాథమిక హక్కులు, శాంతి భద్రతలు, చట్టాల అమలు వంటి అంశాలలో ఆయా దేశాలలో సాధించిన ప్రగతి ప్రాతిపదికన చట్టబద్ధ పాలన సూచీ రూపొందుతుంది. మోదీ అధికారం లోకి వచ్చిన తర్వాత రూల్‌ ఆఫ్‌ లా ఇండెక్స్‌లో (Rule of Law Index) భారత్‌ ర్యాంకు ఏటికేడు దిగజారుతూ వస్తున్నది. 2015లో ఓవరాల్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 57వ స్థానంలో ఉండగా, 2025కి 86వ ర్యాంకుకు దిగజారింది. ఇక అవినీతిరహిత దేశాల జాబితాలో గత ఏడాది 97వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 99వ స్థానానికి చేరింది.

Read Also : http://Gold rate 04/11/25 : కొండెక్కిన బంగారం ధరలు…

 Rule of Law
Rule of Law

మోదీ పాలనలో దేశంలో ప్రజల ప్రాథమిక హక్కులు ఏ స్థితిలో ఉన్నాయో రుజువు చేసేందుకు ఈ ర్యాంకే నిదర్శనం. 2015లో భారత్‌ 62వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 103వ స్థానానికి పడిపోయింది. చట్టాల అమలు యంత్రాంగం పనితీరులోనూ శాంతి భద్రతల విషయంలో గత ఏడాది 98వ ర్యాంకులో ఉన్న భారత్‌ ఈ ఏడాది 105వ స్థానానికి పడిపోవడం క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితికి అద్దంపడుతుంది. చట్టాల అమలు యంత్రాంగం పనితీరులో గత ఏడాది 78వ ర్యాంకులో ఉన్న భారత్‌ ఈ ఏడాది 79వ స్థానానికి పడిపోయి మోదీ ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేసింది.

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2025 లో భారతదేశం ర్యాంక్?

2025 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికలో 180 దేశాలలో భారతదేశం 151వ స్థానంలో ఉంది. కేంద్రీకృత మీడియా యాజమాన్యం, రాజకీయ ప్రభావం మరియు జర్నలిస్టుల భద్రతా సమస్యలు వంటి అంశాలను భారతదేశం ర్యాంకింగ్‌కు దోహదపడే అంశాలుగా RSF ఎత్తి చూపింది.

చట్టాల పాలనను ఎవరు స్థాపించారు?

ఆధునిక కాలంలో “చట్ట పాలన” అనే వ్యక్తీకరణను ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత సాధారణంగా AV డైసీకి దక్కినప్పటికీ, చట్టపరమైన భావన అభివృద్ధి చరిత్ర ద్వారా పురాతన గ్రీస్, మెసొపొటేమియా, భారతదేశం మరియు రోమ్ వంటి అనేక పురాతన నాగరికతలకు చేరుకుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper :epapervaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.