Gas tanker explosion: చిలీ రాజధాని శాంటియాగోలో గురువారం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ద్రవ రూపంలో ఉన్న గ్యాస్ను (LPG) తరలిస్తున్న ఓ భారీ ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తా పడి పేలిపోవడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
స్థానిక గ్యాస్ సంస్థ ‘గాస్కో’కు చెందిన ఈ ట్రక్కు ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. క్రాష్ అయిన నిమిషాల వ్యవధిలోనే ట్రక్కులోని గ్యాస్ ట్యాంకర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ధాటికి ట్రక్కు డ్రైవర్తో పాటు మరో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ అలుముకుంది.
Read Also: Medak Municipal : మెదక్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లకు ఘన సన్మానం
నిమిషాల్లోనే అగ్నిగోళంగా మారిన ట్రక్కు
పేలుడు తీవ్రతకు 150 నుంచి 200 మీటర్ల పరిధిలోని 50 వాహనాలు దెబ్బతిన్నాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఎగిసిపడిన శకలాలు మూడు వ్యాపార సంస్థల ప్రాంగణాల్లో పడ్డాయని చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ తెలిపారు. శాంటియాగో గవర్నర్ క్లాడియో ఒరెగో సమాచారం ప్రకారం.. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. “ఒక వ్యక్తి శరీరం 100 శాతం కాలిపోయింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు” అని గవర్నర్ పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోడ్డుపై మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్న దృశ్యాలు భీతావహంగా ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: