CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లకు ఉగాది పండుగ సందర్భంగా అదిరిపోయే శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టి, బిల్లుల కోసం ఎదురుచూస్తున్న చిన్న కాంట్రాక్టర్లకు ఊరటనిస్తూ, మొత్తం రూ.2,000 కోట్ల బిల్లుల చెల్లింపునకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Read Also:AP Micro Irrigation Subsidy: వారికి 100 శాతం రాయితీతో డ్రిప్ పరికరాలు!

సీఎం చంద్రబాబు ఆదేశాలతో తక్షణ చెల్లింపులు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. కాంట్రాక్టర్ల బ్యాంక్ ఖాతాల్లో ఈరోజే (ఉగాది పండుగ రోజు) డబ్బులు జమ చేయనున్నట్లు అధికారులు ధృవీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50,000 మంది చిన్న కాంట్రాక్టర్లకు ఈ నిర్ణయంతో పెద్ద ఊరట లభించనుంది.
కోటి లోపు బిల్లుల వారికే ప్రాధాన్యత
బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతకు మరియు చిన్న కాంట్రాక్టర్ల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చింది. ఈ నిధుల విడుదల ద్వారా ప్రయోజనం పొందే వారిలో ఎక్కువమంది రూ.కోటి లోపు విలువైన పనులు చేసినవారే ఉన్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న చిన్న కాంట్రాక్టర్లకు ఈ ఉగాది కానుక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: