ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అధ్యక్షతన నవంబరు 7వ తేదీన జరగనుంది. ప్రతి నెల రెండుసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా నవంబర్ నెలకు ఇదే మొదటి భేటీ. ఈ సమావేశం కోసం అజెండాలోని అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను నవంబర్ 5వ తేదీ సాయంత్రానికి పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also: Amaravati: విజయవాడ పరిధిలో కృష్ణానదిపై రెండు ఆరు వరుసల వంతెనలు!
రానున్న ఆంధ్రప్రదేశ్(Chandrababu Naidu) మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ సదస్సు (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ)(Confederation of Indian Industry) నిర్వహణపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ సదస్సు కోసం ఇప్పటికే నియమించిన మంత్రివర్గ ఉప-సంఘం ఇచ్చిన సూచనలపై కూడా కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది.
దీంతో పాటు, రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల పురోగతి, అలాగే వివిధ సంస్థలకు ప్రభుత్వ భూముల కేటాయింపులు వంటి కీలక అంశాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇదే సందర్భంలో, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు, విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు ముఖ్యమైన సూచనలు, దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్న ముఖ్యమైన సదస్సు ఏమిటి?
నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ సదస్సు (CII Summit) పై చర్చిస్తారు.
కేబినెట్లో చర్చించనున్న రాజధానికి సంబంధించిన అంశం ఏమిటి?
రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై చర్చించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: