📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Budget 2026 : బడ్జెట్ బిగ్ షాక్, ఏపీకి రేర్ మినరల్స్, హైస్పీడ్ రైలు!

Author Icon By Sai Kiran
Updated: February 1, 2026 • 2:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Budget 2026 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పలు కీలక ప్రకటనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ సహా కేరళ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీతకు ప్రత్యేక పథకం తీసుకువస్తున్నట్లు తెలిపారు. సహజ వనరులు అధికంగా ఉన్న తీర ప్రాంత రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించి ఖనిజాభివృద్ధిని వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.12.2 లక్షల కోట్ల భారీ కేటాయింపు ప్రకటించారు. ఫార్మా, విద్య, పరిశోధన రంగాల్లో మూడు కొత్త జాతీయ స్థాయి సంస్థలు, సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0 కోసం రూ.40 వేల కోట్లు, అలాగే మూడు రసాయన పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఎంఎస్ఎంఈల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణను కూడా తీసుకొస్తున్నట్లు చెప్పారు.

Read Also: Kuppam : టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

Budget 2026

రవాణా రంగంలో పెద్ద సంచలనం సృష్టిస్తూ ఏడు హైస్పీడ్ రైలు (Budget 2026) కారిడార్లను ప్రకటించారు. వీటిలో Hyderabad కేంద్రంగా పుణే–హైదరాబాద్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై మార్గాలు ఉండటం విశేషం. అదేవిధంగా ఢిల్లీ–వారణాసి, ముంబై–పుణే వంటి కీలక మార్గాలు కూడా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు ఉపాధి అవకాశాలను పెంచుతాయని ఆమె తెలిపారు.

టెక్స్‌టైల్ రంగానికి వచ్చే ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు, సూక్ష్మ పరిశ్రమలకు రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అలాగే మూడు ఆయుర్వేద ఆసుపత్రులు, యువతకు కొత్త వైద్య కోర్సులు, బ్యాంకింగ్ రంగ సంస్కరణలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తం మీద ఈ బడ్జెట్ దేశ ఆర్థికాభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.