Budget 2026 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పలు కీలక ప్రకటనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ సహా కేరళ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీతకు ప్రత్యేక పథకం తీసుకువస్తున్నట్లు తెలిపారు. సహజ వనరులు అధికంగా ఉన్న తీర ప్రాంత రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించి ఖనిజాభివృద్ధిని వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.12.2 లక్షల కోట్ల భారీ కేటాయింపు ప్రకటించారు. ఫార్మా, విద్య, పరిశోధన రంగాల్లో మూడు కొత్త జాతీయ స్థాయి సంస్థలు, సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0 కోసం రూ.40 వేల కోట్లు, అలాగే మూడు రసాయన పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఎంఎస్ఎంఈల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణను కూడా తీసుకొస్తున్నట్లు చెప్పారు.
Read Also: Kuppam : టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు
రవాణా రంగంలో పెద్ద సంచలనం సృష్టిస్తూ ఏడు హైస్పీడ్ రైలు (Budget 2026) కారిడార్లను ప్రకటించారు. వీటిలో Hyderabad కేంద్రంగా పుణే–హైదరాబాద్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై మార్గాలు ఉండటం విశేషం. అదేవిధంగా ఢిల్లీ–వారణాసి, ముంబై–పుణే వంటి కీలక మార్గాలు కూడా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు ఉపాధి అవకాశాలను పెంచుతాయని ఆమె తెలిపారు.
టెక్స్టైల్ రంగానికి వచ్చే ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు, సూక్ష్మ పరిశ్రమలకు రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అలాగే మూడు ఆయుర్వేద ఆసుపత్రులు, యువతకు కొత్త వైద్య కోర్సులు, బ్యాంకింగ్ రంగ సంస్కరణలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తం మీద ఈ బడ్జెట్ దేశ ఆర్థికాభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: