BJP Kerala Second List: కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం హీటెక్కుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచింది. గురువారం ఢిల్లీ వేదికగా 39 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది.
అగ్రనేతల సమక్షంలో కీలక నిర్ణయం

ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు పార్టీ జాతీయ అధ్యక్షుడు పాల్గొన్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (CEC) సమావేశంలో ఈ పేర్లను ఖరారు చేశారు. కేరళలో పాగా వేయడమే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతోంది బీజేపీ.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: