Bengaluru Crime: బెంగళూరు నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. దేశానికి గర్వకారణమైన Indian Space Research Organisation, ISROలో ఎన్నో సంవత్సరాలు సేవలందించి పదవీ విరమణ చేసిన ఓ మాజీ అధికారి, తన సొంత భార్యను హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే.. దక్షిణ బెంగళూరులోని బొమ్మనహళ్లి ప్రాంతంలో ఉన్న ‘ది వర్చ్యూసో’ అపార్ట్మెంట్లో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇస్రో మాజీ ఉద్యోగి నాగేశ్వర్ రావు (65), తన భార్య సంధ్యశ్రీని టవల్తో గొంతు నులిమి చంపేశాడు.
Read Also: Smoking : సిగరెట్ ప్రియులకు భారీ షాక్..మీ జేబులు చిల్లు అయ్యే వార్త
అనంతరం ఇంట్లోనే ఉండి, తన పరిచయస్తుడు ఒకరికి ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపాడు. ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఉదయం 11 గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని నాగేశ్వర్ రావును అరెస్ట్ చేశారు. పోలీసులు వచ్చే వరకు నాగేశ్వర్ రావు ఘటన స్థలంలోనే ఉన్నాడు.పోలీసుల కథనం ప్రకారం, నాగేశ్వర్ రావు కొంతకాలంగా తీవ్ర డిప్రెషన్కు చికిత్స తీసుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించిన అతడు, తాను చనిపోయే ముందు భార్యను కూడా చంపేయాలని నిర్ణయించుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు.”నిందితుడు డిప్రెషన్తో చాలా ఒత్తిడిలో ఉన్నాడు. ఘటన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని భావించి భార్యపై దాడి చేశాడు. దీని వెనుక ఇతర పెద్ద కారణాలేవీ లేవని తెలుస్తోంది,” అని వైట్ఫీల్డ్ డీసీపీ సైదులు అదవత్ మీడియాకు తెలిపారు. ఈ దంపతులకు అమెరికాలో నివసిస్తున్న ఒక కుమార్తె ఉండగా, ఆమెకు ఈ విషయంపై సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: