📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ 

Author Icon By Saritha
Updated: February 4, 2026 • 5:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్(AP) ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య అమరావతిలో (Amaravati) జరిగిన కీలక భేటీ ముగిసింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కూటమి పక్షాల మధ్య సమన్వయం, భవిష్యత్ కార్యాచరణ వంటి అనేక కీలక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

The meeting between CM Chandrababu and Deputy CM Pawan has concluded.

Read Also: ASP Deeksha Nellore: షబ్-ఎ-బరాత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టౌన్ ఏఎస్పీ

వైసీపీ కుట్రలు, కూటమి సమన్వయంపై చర్చ

(AP) వైసీపీ అనుసరిస్తున్న వైఖరి పైనే ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రాజకీయ అంశాలతో పాటు, త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీపై నేతలు ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం. అలాగే, పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లతో పాటు డైరెక్టర్ల నియామకంపై కూడా సమాలోచనలు జరిపారు.

తిరుమల లడ్డూ ప్రసాదం వంటి అంశాలపై వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న విష ప్రచారాన్ని సమష్టిగా తిప్పికొట్టాలని, ఇందుకోసం కూటమిలోని మూడు పార్టీల నేతలు కలిసి ఉమ్మడి మీడియా సమావేశాలు నిర్వహించాలని పవన్ సూచించినట్లు సమాచారం. రాబోయే 15 ఏళ్లు కూటమే అధికారంలో కొనసాగేలా పటిష్టమైన భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలనే దిశగా కూడా వీరి మధ్య చర్చలు సాగినట్లు తెలుస్తోంది. నిన్న కేబినెట్ భేటీకి ముందు చంద్రబాబు, పవన్ క్లుప్తంగా మాట్లాడుకున్నప్పటికీ, అన్ని అంశాలపై విపులంగా చర్చించేందుకు ఈరోజు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.