ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సహకరించాలంటూ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పర్యాటకం, క్రీడలు, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక రంగాల్లో విక్టోరియా సాధించిన ప్రగతిని, సాంకేతిక నైపుణ్యాన్ని ఏపీకి అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన మెల్బోర్న్లో విక్టోరియా రాష్ట్ర పర్యావరణ, టూరిజం, స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డిమోపౌలోస్తో గురువారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
Read also : Rahul Gandhi : మహాకూటమి పోస్టర్లలో రాహుల్ ఫొటో మాయం..
పర్యాటక రంగంలో నైపుణ్యం బదిలీ
లోకేశ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, వారసత్వ పర్యాటక రంగంలో విక్టోరియా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిందని ప్రశంసించారు. “ఆంధ్రప్రదేశ్లో పాపికొండలు, విశాలమైన విశాఖ బీచ్ వంటి సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. విక్టోరియాలోని ‘గ్రేట్ ఓషన్ రోడ్’ తరహాలో పర్యావరణహిత బ్రాండింగ్ను ఏపీ తీర ప్రాంతానికి అందించడంలో మీ నైపుణ్యం మాకు అవసరం” అని లోకేశ్ అన్నారు. ఏపీ పర్యాటక శాఖతో కలిసి హెరిటేజ్ టూరిజం, మార్కెటింగ్, ఎకో-సర్టిఫికేషన్ వంటి అంశాలపై పనిచేయాలని ఆయన ప్రతిపాదించారు. అంతేకాకుండా, అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి కోసం అడ్వెంచర్ గైడ్లకు, రేంజర్లకు విక్టోరియా సంస్థల ద్వారా శిక్షణ, సర్టిఫికేషన్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
క్రీడలు, పర్యావరణ పరిరక్షణలో సహకారం
ఆంధ్రప్రదేశ్కు 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉందని గుర్తుచేసిన లోకేశ్, విక్టోరియాలోని పోర్టు ఫిలిప్ బే ప్రాజెక్టు తరహాలో అత్యాధునిక వాతావరణ సాంకేతికతను ఉపయోగించి ఏపీ తీరప్రాంతాన్ని పరిరక్షించేందుకు ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి (ఆర్ & డి) కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వ్యర్థాల నిర్వహణ, కార్బన్ న్యూట్రల్ టూరిజంపై కలిసి పనిచేయాలని కోరారు. క్రీడారంగంలోనూ భాగస్వామ్యానికి ఆసక్తి చూపారు. ఏపీ, విక్టోరియాల మధ్య క్రికెట్, హాకీ వంటి క్రీడల్లో ఉమ్మడి శిక్షణా శిబిరాలు నిర్వహించాలని ప్రతిపాదించారు. విక్టోరియాలోని మెల్బోర్న్ గ్రాండ్ ప్రిక్స్ తరహాలో ఏపీలో ప్రపంచ స్థాయి ఈవెంట్ల నిర్వహణకు సాయం అందించడంతో పాటు, యువతకు గ్రీన్ జాబ్స్పై నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి లోకేశ్ కోరారు.
మంత్రి నారా లోకేశ్ ఏ రాష్ట్ర మంత్రిని కలిశారు?
ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర పర్యావరణ, టూరిజం, స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డిమోపౌలోస్ను కలిశారు.
ఏపీ తీర ప్రాంత అభివృద్ధికి లోకేశ్ ఏం సహకారం కోరారు?
విక్టోరియాలోని ‘గ్రేట్ ఓషన్ రోడ్’ తరహాలో పర్యావరణహిత బ్రాండింగ్ను, హెరిటేజ్ టూరిజం అభివృద్ధిని కోరారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :