AP Liquor Scam: ఏపీ మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామంచోటుచేసుకుంది. ఈ కేసులో ఏ7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్రెడ్డిని సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న అవినాశ్ రెడ్డిని కోర్టు అనుమతితో విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించి, ప్రత్యేక బృందాలు విచారణ ప్రారంభించాయి.
Read Also: Jewelry Shop Theft: రూ.1.50 కోట్లు విలువ చేసే నగలు కొట్టేశాడు

రెండు రోజుల పాటు కొనసాగనున్న విచారణ
అనంతరం భద్రతా ఏర్పాట్ల మధ్య అవినాశ్రెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. మద్యం ముడుపుల వ్యవహారంలో షెల్ కంపెనీల ద్వారా జరిగిన భారీ నగదు లావాదేవీల వెనుక అవినాశ్ రెడ్డి హస్తం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డికి (ఏ1) సమీప బంధువు కావడంతో, అక్రమ సొమ్మును వివిధ మార్గాల్లో మళ్లించే బాధ్యతలను ఈయనే చూసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ముఖ్యంగా షెల్ కంపెనీల పేర్లతో నకిలీ ఖాతాలను సృష్టించి, అక్రమంగా వచ్చిన డబ్బును చట్టబద్ధమైన ఆదాయంగా చూపించే ప్రయత్నం చేశారనే ఆరోపణలపై సిట్ అధికారులు లోతుగా ప్రశ్నిస్తున్నారు. అక్కడ ప్రత్యేక విచారణ గదిలో అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ రెండు రోజుల పాటు కొనసాగనుంది. రేపు, ఎల్లుండి కూడా ముప్పిడి అవినాశ్రెడ్డిని ప్రశ్నించనున్నారు. ఆయన నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: