Adulterated Ghee: భాగ్యనగరంలోని ప్రముఖ ప్యారడైజ్ హోటల్లో వినియోగిస్తున్న నెయ్యి నాణ్యతపై జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని ఈ హోటల్లో వాడుతున్న ‘సుధీర్ ఇండస్ట్రీస్’కు చెందిన నెయ్యి నమూనాలను అధికారులు సేకరించారు. ఈ నమూనాలను నాచారం ల్యాబ్లో పరీక్షించగా, అవి ఆరోగ్యానికి హానికరమైనవి (Unsafe) అని తేలింది. ఈ వార్త నగరంలోని బిర్యానీ ప్రియులను ఆందోళనకు గురిచేస్తోంది.
Read Also: Delhi Liquor: మద్యం పాలసీ కేసు కొట్టివేత..కేజ్రీవాల్ కన్నీటిపర్యంతం

మైసూర్ ల్యాబ్కు చేరిన నమూనాలు
నాచారం ల్యాబ్ నివేదికపై నెయ్యి తయారీదారు (సుధీర్ ఇండస్ట్రీస్) అభ్యంతరం వ్యక్తం చేయడంతో, జీహెచ్ఎంసీ అధికారులు ఆ నమూనాలను మరింత లోతైన పరీక్షల కోసం మైసూర్లోని కేంద్ర ఆహార ప్రయోగశాలకు పంపారు. మైసూర్ ల్యాబ్ నివేదికలో కూడా నెయ్యి కల్తీ అని తేలితే, సంబంధిత తయారీదారుపై, హోటల్ యాజమాన్యంపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, నగరంలో నాసిరకం, కల్తీ నెయ్యి విస్తృతంగా వినియోగంలో ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: