Actress Regina Cassandra: తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రెజీనా కసాండ్రా, బాలీవుడ్లో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించింది. 2019లో ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజీనా, అక్కడివారు తనను ఒక నటిగా కాకుండా ‘సౌత్ నుంచి వచ్చిన అమ్మాయి’గానే చూశారని, హిందీ రాదనే అపోహతో చిన్నచూపు చూశారని, ఇది తనను ఎంతో బాధించిందని తెలిపింది.
Read Also: Mammootty Health Update: తొలిసారి ఆరోగ్య సమస్యపై నోరు విప్పిన మమ్ముట్టి
అయితే అన్ని అనుభవాలు నెగెటివ్ కాదని కూడా ఆమె స్పష్టం చేసింది. కొంతమంది దర్శకులు, సహ నటులు ఎంతో గౌరవంగా మెలిగి, ప్రొఫెషనల్ వాతావరణం కల్పించారని పేర్కొంది. ‘మంచి మనుషులు కూడా ఉన్నారు. వాళ్ల వల్లే ఆ కష్టమైన దశను దాటగలిగాను,’ అంటూ పాజిటివ్ కోణాన్ని కూడా గుర్తు చేసింది. సౌత్ నుంచి బాలీవుడ్కు వెళ్లే నటీనటులు ఎదుర్కొనే సమస్యలపై ఇప్పటికే పలువురు మాట్లాడినప్పటికీ.. రెజీనా తాజా వ్యాఖ్యలు మరోసారి ఇండస్ట్రీలోని అంతర్గత వివక్షపై చర్చకు దారితీశాయి.
సైకాలజీ మాస్టర్ టు యాక్టింగ్ కెరీర్
రెజీనా సినీ ప్రయాణం కేవలం గ్లామర్ వరకే పరిమితం కాలేదు. ఆమె విద్యాభ్యాసం పరంగా కూడా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. చెన్నైలో పుట్టి పెరిగిన ఆమె, సైకాలజీలో డిగ్రీ, మాస్టర్స్ పూర్తి చేశారు. కేవలం 16 ఏళ్ల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసిన రెజీనా.. ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో పరిణతి చెందిన నటిగా ఎదిగారు. తన మనసులో ఉన్న విషయాలను దాచుకోకుండా ధైర్యంగా చెప్పడం ద్వారా ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: