ఆధార్ కార్డులో(Aadhar Update) వివరాలు సరిచేయాలంటే ఇప్పటివరకు ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి క్యూ లో నిలబడి టోకెన్ తీసుకోవాల్సి వచ్చేది. పేరు, పుట్టిన తేదీ లేదా చిరునామా వంటి చిన్న మార్పులకైనా ఒకరోజంతా సమయం పట్టేది. కానీ, ఈ సమస్య ఇక ఉండదని యూఐడీఏఐ (UIDAI) ప్రకటించింది.
Read Also: Supreme Court:డిజిటల్ అరెస్ట్’ మోసాలపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

నవంబర్ 1 నుంచి ప్రజలు ఇంట్లో నుంచే ఆధార్ వివరాలను(Aadhar Update) ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే అవకాశం పొందబోతున్నారు. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నెంబర్ వంటి వివరాలు ఇప్పుడు ఆన్లైన్ ద్వారా సులభంగా మార్చుకోవచ్చు. యూఐడీఏఐ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కొత్త విధానం ద్వారా ఆధార్ అప్డేట్ ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా, సురక్షితంగా మారనుంది. అయితే బయోమెట్రిక్ అప్డేట్స్(Biometric updates) (ఫింగర్ప్రింట్స్, ఐరిస్ స్కాన్) కోసం మాత్రం ఆధార్ సేవా కేంద్రాలకే వెళ్లాల్సి ఉంటుంది.
ఇక ఫీజుల విషయానికి వస్తే —
- పేరు, చిరునామా మార్పులు: ₹75
- బయోమెట్రిక్ అప్డేట్: ₹125
- 15 ఏళ్లలోపు పిల్లల బయోమెట్రిక్ అప్డేట్: ఉచితం
యూఐడీఏఐ ప్రజలకు ఆన్లైన్ సౌకర్యాన్ని అందించడం ద్వారా ఆధార్ సేవా కేంద్రాల వద్ద రద్దీ తగ్గి, సమయం ఆదా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఆధార్ వివరాలు ఎక్కడ అప్డేట్ చేయవచ్చు?
అధికారిక వెబ్సైట్ myaadhaar.uidai.gov.in ద్వారా ఆన్లైన్లో వివరాలు మార్చుకోవచ్చు.
అన్ని వివరాలు ఆన్లైన్లో మార్చుకోవచ్చా?
పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నెంబర్ వంటి వివరాలు మాత్రమే ఆన్లైన్లో మార్చుకోవచ్చు. బయోమెట్రిక్ మార్పులకు సేవా కేంద్రం తప్పనిసరి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: