ఇండియన్ క్రికెట్లో ఒక విశిష్ట స్థానం సంపాదించిన ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ashwin Ravichandran). ఆఫ్ స్పిన్నర్గా తన కెరీర్ను ప్రారంభించిన అశ్విన్, బౌలింగ్లోనే కాకుండా బ్యాటింగ్లోనూ తన ప్రతిభను నిరూపించాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో 500కి పైగా వికెట్లు తీసిన భారత ఆటగాడిగా అశ్విన్ ఒక ప్రత్యేక రికార్డు సొంతం చేసుకున్నాడు. అయితే ఐపీఎల్ రంగంలో అతని ప్రయాణం మాత్రం ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. అశ్విన్ తొలిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుతో తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఆ జట్టులో భాగమై విజేతగా నిలిచాడు.ఇటీవల ఐపీఎల్కు వీడ్కోలు పలికిన అశ్విన్పై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ (ట్విట్టర్) లో లైవ్ సెషన్ నిర్వహించిన డివిలియర్స్ (AB de Villiers) మాట్లాడుతూ, అశ్విన్ సీఎస్కేను విడిచి వెళ్లడం అతని కెరీర్లో తీసుకున్న అతిపెద్ద తప్పిదమని అభిప్రాయపడ్డాడు.
ఒక లైవ్ సెషన్లో డివిలియర్స్ మాట్లాడుతూ
ఎందుకంటే సీఎస్కే (CSK) జట్టులో అతనికి ఉన్న స్థానం, జట్టు వాతావరణం, మహేంద్ర సింగ్ ధోనీ ఇచ్చే ప్రోత్సాహం అన్నీ అతన్ని మరింతగా మెరుగుపరచేవని అన్నాడు. ఇతర జట్లలో అశ్విన్ ఎక్కువ కాలం నిలబడలేకపోయినట్టుగా తనకు అనిపించిందని స్పష్టం చేశాడు.ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్ఫామ్లో నిర్వహించిన ఒక లైవ్ సెషన్లో డివిలియర్స్ మాట్లాడుతూ, “అశ్విన్ ఒక అద్భుతమైన ఆటగాడు. ఆట నియమాలను లోతుగా అధ్యయనం చేసే అతని పద్ధతి అమోఘం. అతనో క్రికెట్ శాస్త్రవేత్త, ఒక ప్రొఫెసర్ లాంటి వాడు. అలాంటి ఆటగాళ్లంటే నాకు ఎంతో గౌరవం” అని ప్రశంసించాడు. టీమిండియాకు, ముఖ్యంగా సీఎస్కేకు అశ్విన్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని గుర్తుచేశాడు.”అశ్విన్ చెన్నై తర్వాత వేరే జట్లకు ఆడినప్పటికీ, నాకు మాత్రం అతను ఎప్పటికీ పసుపు జెర్సీ ఆటగాడిగానే గుర్తుండిపోతాడు.

బ్యాట్స్మన్గా అశ్విన్ ప్రతిభను చాలామంది తక్కువగా అంచనా వేశారని
నా అభిప్రాయం ప్రకారం, అతను ఎల్లప్పుడూ సీఎస్కేతోనే కొనసాగి ఉండాల్సింది. ఆటగాళ్ల రిటెన్షన్, వేలం వంటి ప్రక్రియల్లో ఎన్నో అంశాలు ఉంటాయి కాబట్టి అది అతని చేతుల్లో లేకపోవచ్చు. కానీ, అతడిని నేను ఎప్పటికీ సీఎస్కే ఆటగాడిగానే చూస్తాను” అని డివిలియర్స్ పేర్కొన్నాడు.అంతేకాదు, బ్యాట్స్మన్గా అశ్విన్ ప్రతిభను చాలామంది తక్కువగా అంచనా వేశారని డివిలియర్స్ అన్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాట్తో ఎన్నోసార్లు ఆదుకున్నాడని, అతనిలో పోరాట పటిమ అద్భుతమని కొనియాడాడు.ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత 38 ఏళ్ల అశ్విన్ ఈ లీగ్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇతర లీగుల్లో ఆడటంపై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన ఐపీఎల్ కెరీర్లో మొత్తం 221 మ్యాచ్లు ఆడిన అశ్విన్, 7.20 ఎకానమీతో 187 వికెట్లు పడగొట్టాడు. 2024 డిసెంబర్లో అంతర్జాతీయ క్రికెట్కు కూడా అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
అశ్విన్ ఏ రాష్ట్రానికి చెందినవాడు?
ఆయన తమిళనాడులోని చెన్నై నగరానికి చెందినవాడు.
అశ్విన్ క్రికెట్ కెరీర్ ఎలా ప్రారంభమైంది?
మొదట ఆయన ఓపెనింగ్ బ్యాటర్గా ఆడేవాడు. కానీ తర్వాత ఆఫ్ స్పిన్ బౌలింగ్ వైపు దృష్టి పెట్టి భారత జట్టులో స్థానం సంపాదించాడు.
Read hindi news: hindi.vaartha.com
Read also: