KTR and Harish Rao in Bhogi celebrations

భోగి వేడుకల్లో కేటీఆర్‌, హరీశ్‌ రావు

హైదరాబాద్‌: భోగి వేడుకల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి సోమవారం తన నివాసంలో అట్టహాసంగా భోగి పండుగ నిర్వహించారు. కేటీఆర్‌, హరీశ్‌ రావుతో కలిసి ఆయన భోగి మంటను వెలగించారు. హరిదాసులకు నిత్యావసరాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా గంగిరెద్దుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేశ్‌, పాడి కౌశిక్‌ రెడ్డి, బాండారి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, పటోళ్ల కార్తీక్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

image
image

మరోవైపు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున కేబీఆర్‌ పార్క్‌ వద్ద భోగి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భోగి మంటలను వెలగించారు. మంటల చుట్టూ యువతులు, మహిళలు ఆడిపాడారు. చిన్నారులకు భోగిపళ్లు పోశారు. హరిదాసులకు బియ్యం, ఇతర నిత్యావసరాలు వితరణ చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పతంగులు ఎగరవేసి సంబరాలు చేసుకున్నారు.

image
image

కాగా, తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి వేడుకలో మొదటిరోజైన భోగి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి భోగి మంటలు వేసి ఆనందంతో పండుగ జరుపుకుంటున్నారు. . భోగి మంటలు వెలిగించి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ సందడి చేస్తు్న్నారు. మరోవైపు నగరవాసులంతా పల్లెలకు వెళ్లడంతో గ్రామాల్లో వేడుకలు మరింత ఘనంగా జరుగుతున్నాయి.

Related Posts
గుజరాత్: ఐఫోన్ లంచం కేసులో పోలీసు ఇన్‌స్పెక్టర్ అరెస్టు
arrest

గుజరాత్ రాష్ట్రంలో ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను గుజరాత్ ఆంటీ కరప్షన్ బ్యూరో (ACB) శుక్రవారం అరెస్టు చేసింది. ఆ ఇన్‌స్పెక్టర్ పై , ఒక ఫ్యూయల్ డీలర్ Read more

డోమినికా ప్రధానమంత్రి మోడీకి అత్యున్నత గౌరవం ఇవ్వనుంది
Shri Narendra Modi Prime Minister of India

కామన్వెల్త్ ఆఫ్ డోమినికా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన అత్యున్నత జాతీయ గౌరవాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ గౌరవం, ప్రధానమంత్రి మోడీ COVID-19 మహమ్మారి సమయంలో Read more

ఆశ వర్కర్ పరిస్థితి విషయం
Asha is a matter of worker

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం, 18,000 రూపాయలు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోఠి డిఎంవి కార్యాలయం ముందు ఆశా Read more

టెస్లా ప్రతినిధులతో నారా లోకేష్‌ సమావేశం
lokesh busy us

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా అనేక కంపెనీల ప్రతినిధులతో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలను ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పర్యటనలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *