కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao) అరెస్ట్, అమరావతి మహిళలు, అసభ్య వ్యాఖ్యలు, రిమాండ్ రిపోర్ట్, మంగళగిరి కోర్టు).రాజధాని అమరావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అమరావతి మహిళలపై (On the women of Amaravati)అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. ఆయన్ను మంగళగిరి కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించింది.ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ తాజాగా బయటకు వచ్చింది. పోలీసుల అభిప్రాయం ప్రకారం, మహిళలపై వ్యాఖ్యలు యాదృచ్ఛికం కావని, ఇవి ముందస్తు ప్రణాళికతో చేశారని పేర్కొన్నారు. దురుద్దేశంతో సమాజంలో ఉద్రిక్తతలు రేపేందుకు వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు.అమరావతి పై ఈ విధంగా అసత్య ఆరోపణలు చేయడం వెనుక ధీర్ఘకాలిక కుట్ర ఉందని అధికారులు తెలిపారు. దర్యాప్తు సంస్థలు దీన్ని పూర్తిగా తేల్చాల్సిన అవసరం ఉందని రిమాండ్ రిపోర్ట్లో వివరించారు. ఇది కేవలం మీడియా ప్రసారం కాదు, నేరపూరిత చర్యగా పేర్కొన్నారు.
సాక్షి డిబేట్లో వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి టీవీలో ప్రసారమైన ఓ డిబేట్కు కొమ్మినేని యాంకర్గా వ్యవహరించగా, అందులో వివిఆర్ కృష్ణంరాజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే, కొమ్మినేని వాటిని ఖండించాల్సింది పోయి, మద్దతుగా మాట్లాడినట్లు రిపోర్ట్ పేర్కొంది.కొమ్మినేని వ్యాఖ్యలు చూసి శోకించారనే వ్యాఖ్య చేయడం ద్వారా, కృష్ణంరాజు వ్యాఖ్యలకు పరోక్షంగా ప్రోత్సాహం కలిగించారన్నది పోలీసుల అభిప్రాయం. పైగా, విచారణ సమయంలో ఆయన పూర్తిగా సహకరించలేదని పోలీసులు వెల్లడించారు.
విచారణ కొనసాగుతోంది
పోలీసుల ప్రకారం, కొమ్మినేనిను కస్టడీలో తీసుకుంటే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఇంకా మిగిలిన సాక్షులను కూడా విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
శాంతిభద్రతలపై తీవ్ర ప్రభావం
పోలీసులు ఈ వ్యాఖ్యలను రాష్ట్ర శాంతిభద్రతలకు ప్రమాదకరంగా అభివర్ణించారు. దీనివల్ల ఉద్రిక్తతలు రెచ్చగొట్టే అవకాశముందని, నేరపూరిత ఉద్దేశంతో చేశారని పేర్కొన్నారు. ఇదే కారణంగా ఆయనను రిమాండ్కు పంపించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
Read Also : Arvind Kejriwal :మూడు నెలల్లో ఢిల్లీని నాశనం చేశారు.. బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు