హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాది కంటే ప్రస్తుత ఖరీఫ్లో (Kharif) సాగైన విస్తీర్ణంలో తగ్గుదల చోటు చేసుకుంది. వర్షాలు సకాలంలో, సరిపడా కురవకపోవడంతో పాటు, బోరు బావులు, చెరువుల్లో అంతంత మాత్రంగా ఉన్న నీటి నిల్వల ప్రభావం (Effect of water storage) ఖరీఫ్ (Kharif) సాగుపై చూపుతోంది.

44.10 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట సాగు
ఈ వానాకాలం సీజనులో రాష్ట్ర వ్యాప్తంగా 1.32 కోట్ల ఎకరాలు సాగవుతుందని అంచనా వేయగా, అందులో ఇప్పటివరకు 44.10 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ నివేదికలో వెల్లడయింది. గతేడాది వానాకాలంలో ఇదే సమయానికి 46.95 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, రెండు సీజన్ల పంటలను పోలిస్తే ఈ సారి 2.85 లక్షలు తక్కువగా (2.85 lakhs less) సాగైనట్లు అంచనా వేసింది. ఇక ఈ ఏడాది జూన్లో 138 మి.మీ. వర్షపాత నమోదుకాగా, గతేడాదిలో 170 మి.మీ. వర్షం పడి పంటలు సాగుచేసేలా చేసింది.
రాష్ట్రంలో అంతంత మాత్రంగా వర్షాలు కురిసిన చోట మాత్రమే పత్తి, మొక్కజొన్న, పెసలు, మిర్చి, సోయాబీన్, కంది తదితర ఆరు తడి పంటలు మాత్రమే వేశారు. గతేడాది పత్తి 33.10 ఎకరాలు సాగుచేయగా ఈసారి 31.25 లక్షల ఎకరాలు వేశారు. పెసలు 32 వేల ఎకరాల్లో వేయగా ఈసారి 27,123 ఎకరాలు, వరి 1.57 లక్షలు వేయగా, ఈసారి 2.15 లక్షలు ఎకరాలు సాగుచేశారు. మొక్కజొన్న 2.48 లక్షలు, కందులు 2.72 లక్షలు, సోయాబీన్ 2.65 లక్షలు, చెరుకు 15,100 ఎకరాల్లో రైతులు వేసినట్లు జూన్లో వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది .
ఖరీఫ్ సీజన్ అంటే ఏమిటి?
ఖరీఫ్ సీజన్ అనేది భారతదేశ వ్యవసాయంలో ఒక ముఖ్యమైన పంటల సాగు కాలం. ఇది సాధారణంగా జూన్ నెలలో ప్రారంభమై, అక్టోబర్ లేదా నవంబర్ వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో మోన్సూన్ (వర్షాకాలం) ప్రారంభమవడం వల్ల ఎక్కువగా వర్షాధారిత పంటల సాగు జరుగుతుంది.
ఖరీఫ్ ప్రధాన పంటలు
వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశెనగ, సోయాబీన్, మిరప, నువ్వులు. వర్షాధారంగా సాగుతాయి,వేడి మరియు తేమ ఉన్న వాతావరణం అవసరం.
Read hindi news: hindi.vaartha.com