हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Jagan Mohan Reddy : జగన్ పల్నాడు పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేసిన పల్నాడు ఎస్పీ

Divya Vani M
Jagan Mohan Reddy : జగన్ పల్నాడు పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేసిన పల్నాడు ఎస్పీ

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని రెంటపాళ్ల గ్రామాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన సమయంలో వైసీపీ కార్యకర్తలు భారీగా చేరడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జగన్‌కి స్వాగతంగా వందలాదిమంది బైక్ ర్యాలీ నిర్వహించగా, పలుచోట్ల అభ్యంతరకర పోస్టర్లు కూడా కనిపించాయి.జగన్ పర్యటనపై పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు (Palnadu District SP Srinivasa Rao) స్పందిస్తూ, అనుమతులు కొన్ని నిబంధనలతో మాత్రమే మంజూరయ్యాయని చెప్పారు. అయితే ఆ పరిమితులను పూర్తిగా ఉల్లంఘించినట్లు ఆయన వెల్లడించారు. ర్యాలీలు, పెద్దఎత్తున ప్రజల గుమికూడే పరిస్థితులు ట్రాఫిక్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయని, ప్రజాప్రతినిధులే కొన్ని సందర్భాల్లో పోలీసు ఉత్తర్వులను తృణప్రాయంగా భావించారని ఆవేదన వ్యక్తం చేశారు.

అభ్యంతరకర వ్యాఖ్యలు, పోస్టర్లపై చట్టపరమైన చర్యలు?

ఈ పర్యటనలో వైసీపీ శ్రేణులు పలుచోట్ల అధికారులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అలాగే, కొందరు నేతలు చేసిన ప్రసంగాలు, పోస్టర్లలో ఉన్న సందేశాలు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని సమాచారం. దీంతో, పోలీసు శాఖ న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటోంది. అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

వారం రోజుల్లో కేసుల నమోదుకు అవకాశం?

జగన్ పర్యటనపై పోలీసు విభాగం అందిన వీడియోలు, ఫొటోలు ఆధారంగా పూర్తి నివేదిక తయారుచేస్తోంది. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత వారం రోజుల్లో సంబంధిత వైసీపీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం. జగన్ పర్యటనపై ఈ పరిణామాలు వైసీపీ శ్రేణుల్లో గందరగోళాన్ని రేపుతున్నాయి.

Read Also : School Fee : ‘వామ్మో.. నర్సరీకి రూ.50వేల ఫీజు’.. ఓ తండ్రి ఆవేదన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870