తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలి ఆరోగ్య సమస్యల కారణంగా గురువారం ఆయనను హైదరాబాద్లోని సోమాజిగూడ యశోదా ఆసుపత్రి (Yashoda Hospital)లో అడ్మిట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యులు ఆయనకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

చికిత్స వివరాలు
ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ (KCR), చికిత్స అనంతరం ఈ నెల 5న డిశ్చార్జ్ అయ్యారు. ఆ సమయంలో రక్తంలో షుగర్, సోడియం స్థాయులను పర్యవేక్షించేందుకు ఆయనకు వైద్యులు చికిత్స అందించారు.
వైద్యుల సూచన మేరకు మళ్లీ చేరిక
డిశ్చార్జ్ సమయంలో వైద్యులు కేసీఆర్కు వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అనంతరం తిరిగి హెల్త్ చెకప్ (Health checkup) కోసం ఆసుపత్రికి రావాలని సూచించిన నేపథ్యంలో ఆయన మళ్లీ గురువారం ఆసుపత్రికి వెళ్లారు.
అధికారిక ప్రకటనపై వేచి చూస్తున్న ప్రజలు
తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు లేదా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు విడుదల చేసే అధికారిక ప్రకటన కోసం ప్రజలు, పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య స్థితి నిలకడగానే ఉందని అంటున్నప్పటికీ, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది .
ఫస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ?
సార్వత్రిక ఎన్నికలలో, శ్రీ కె. చంద్రశేఖర్ రావు పార్టీని అధికారంలోకి తెచ్చి, జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు.
కెసిఆర్ జీవిత చరిత్ర ?
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (జననం 17 ఫిబ్రవరి 1954) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన 2014 నుండి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. ఆయన భారత రాష్ట్ర సమితి స్థాపకుడు మరియు నాయకుడు. తెలంగాణ భారత రాష్ట్రంగా మారడానికి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినందుకు ఆయన ప్రసిద్ధి చెందారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Crime: కన్న కూతుర్నే కడ తేర్చిన తల్లికి జీవిత ఖైదు