తెలంగాణలో మహిళలకు ఎన్నికల హామీల అమలుపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, MLC కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు మహిళలు కాంగ్రెస్ నేతలకు పోస్ట్కార్డు ద్వారా ఉత్తరాలు పంపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీల అమలు లేకపోవడం నిరసనకు దారి తీశింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, హామీలను తక్షణమే అమలు చేయాలని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్లకు ఉత్తరాలు రాశారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు ₹2500 నగదు సహాయం. ఇప్పటికీ అమలు చేయలేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లైన ప్రతి ఆడబిడ్డకు ఒక తులం బంగారం ఇవ్వాలని హామీ ఇచ్చారు.
మహిళలు ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. డిగ్రీ చదివిన ప్రతి అమ్మాయికి స్కూటీ ఇవ్వాలని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో నిరసన వ్యక్తమవుతోంది.

తెలంగాణ మహిళల ఆగ్రహం
కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు పూర్తి చేసుకున్నప్పటికీ హామీలను అమలు చేయలేదని మహిళలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆరోపణలు వచ్చాయి.
వాగ్దానాలు నెరవేర్చని పక్షంలో ఢిల్లీలో సోనియా గాంధీ ఇంటి ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గ్రామ మహిళలు కలిసి పోస్ట్కార్డుల ద్వారా తమ డిమాండ్లను కాంగ్రెస్ అధినాయకత్వానికి తెలిపారు. ఈ ఉద్యమంలో గాడ్గే మీనాక్షి, అర్చన, రేణుకబాయి, ఇందుబాయి తదితరులు పాల్గొన్నారు. హామీల అమలు ఆలస్యమైతే తెలంగాణవ్యాప్తంగా మహిళలు ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయాలని సిద్దమవుతున్నారు.
పెద్దఎత్తున ఉద్యమాలు
కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయకుంటే పెద్దఎత్తున ఉద్యమాలు జరుగుతాయని హెచ్చరించారు. తెలంగాణలో మహిళలకు కాంగ్రెస్ హామీల అమలు ఆలస్యం కావడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. హామీలు నెరవేర్చకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని మహిళలు సిద్ధమవుతున్నారు.