భారత దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టుకు త్వరలో కొత్త ప్రధాన న్యాయమూర్తిగా Justice Gavai భూషణ్ రామకృష్ణ గవాయి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం 2025 మే 13తో ముగియనుండగా, ఆయన తరువాత Justice Gavai భారత కొత్త సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సిఫారసు చేశారు. ఈ సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన అనంతరం, గవాయి మే 14న సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.భూషణ్ గవాయి 1960లో మహారాష్ట్రలో జన్మించారు. ఆయన తండ్రి రామకృష్ణ సూర్యబాన్ గవాయి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు, అంబేద్కర్ వాద నేతగా గుర్తింపు పొందారు. రామకృష్ణ గవాయి మహారాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1964 నుండి 1998 వరకు ఆయన లోక్సభ సభ్యుడిగా, ఆ తరువాత బీహార్, సిక్కిం, కేరళ రాష్ట్రాల్లో గవర్నర్గానూ సేవలందించారు. Justice Gavai తన న్యాయ వృత్తిని 1985లో ప్రారంభించి, ప్రభుత్వ ప్లీడర్గా పనిచేశారు. 2003లో బాంబే హైకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. 16 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో 2019లో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.

ఆయనను అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని కొల్లిజియం ప్రతిపాదించింది.సుప్రీంకోర్టులో ఆయన అనేక కీలక తీర్పుల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు, పెద్ద నోట్ల రద్దు వంటి జాతీయ ప్రాధాన్యత గల కేసుల్లో తీర్పులు ఇచ్చారు. 2023లో ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలం పొడిగింపుపై ఇచ్చిన తీర్పు చర్చనీయాంశమైంది. ఆయన జూలై 31 వరకు మాత్రమే కొనసాగాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.Justice Gavai భారత కొత్త సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 14, 2025 నుండి నవంబర్ 24, 2025 వరకు సీజేఐగా పనిచేస్తారు. ఈ కొద్దికాలం నడుపుతూనే భారత న్యాయవ్యవస్థలో మైలురాయిలను స్థాపించే అవకాశముంది. ఆయన సామాజిక నేపథ్యం, న్యాయపరమైన అనుభవం న్యాయవ్యవస్థలో సమానత్వానికి మార్గదర్శకంగా నిలుస్తాయని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.
Read more :Smitha Sabarwal : సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామన్న శ్రీధర్ బాబు