రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRBNTPC) విడుదల చేసిన ఎన్టీపీసీ నోటిఫికేషన్కు సంబంధించిన 8,868 గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. అయితే ఇప్పటివరకు రాత పరీక్షల షెడ్యూల్ను ఆర్ఆర్బీ అధికారికంగా ప్రకటించకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా సీబీటీ–1 ఆన్లైన్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
Read Also: Government Jobs: ప్రొఫెషనల్ కెరీర్ కోసం NALCOలో ఉద్యోగ అవకాశాలు
సీబీటీ–1 ఏప్రిల్ చివర్లో లేదా మే ప్రారంభంలో జరిగే అవకాశం
నిపుణుల అంచనాల ప్రకారం, ఎన్టీపీసీ(RRBNTPC) గ్రాడ్యుయేట్ లెవల్ పోస్టులకు సంబంధించిన సీబీటీ–1 పరీక్షలు ఏప్రిల్ చివరి వారంలో లేదా మే నెల ప్రారంభంలో జరిగే అవకాశం ఉంది. ఈ విషయమై త్వరలోనే ఆర్ఆర్బీ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ఇక అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల రాత పరీక్షలు మే నెలలో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సీబీటీ–1 పరీక్ష పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 90 నిమిషాల సమయం ఇవ్వనున్నారు. జనరల్ అవేర్నెస్, గణితం, రీజనింగ్ అనే మూడు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సిలబస్ దాదాపుగా ఒకే విధంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఇక మరోవైపు, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ (CBTST) రీ-షెడ్యూల్ తేదీలను కూడా బోర్డు ప్రకటించింది. డిసెంబర్ 28న జరిగిన పరీక్షకు హాజరై, రీ-షెడ్యూల్ కోరిన అభ్యర్థుల కోసం ఫిబ్రవరి 11న స్కిల్ టెస్ట్ను నిర్వహించనున్నట్లు ఆర్ఆర్బీ స్పష్టం చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షకు 10 రోజుల ముందే సిటీ ఇంటిమేషన్ స్లిప్ను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని, అలాగే పరీక్షకు నాలుగు రోజుల ముందు నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వస్తాయని ఆర్ఆర్బీ సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: