నిజంగా ప్రస్తుతం ఉద్యోగాలు దొరకడం చాలాచాలా కష్టంగా ఉంది. ఒకవైపు చదువు పూర్తిచేసుకుని, పట్టాలతో బయటికి వస్తున్న యువతకు, అప్పటికే డిగ్రీలు చేతపట్టుకుని కాళ్లు అరిగేలా తిరుగుతున్న నిరుద్యోగుల భవిత అగమ్యగోచరంగా ఉంది.
Read Also: Trump: భారత్ లో చిక్కుకుపోయిన హెచ్-1బీ వీసాదారులకు షాక్ మీద షాక్ లు
ఇక ఉద్యోగం చేస్తున్నవారి టెన్షన్ అంతా ఇంతా కాదు. ఒకవిధంగా చెప్పాలంటే ప్రస్తుతం తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా తయారయ్యాయి. ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు సైతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా వేలల్లో లేఆఫ్ లు (Layoff) ప్రకటిస్తున్నాయి. ఈమధ్య స్పెయిన్ లో ఆఫీసు సమయానికి కంటే ముందుగా వస్తున్నందుకు ఉద్యోగం నుంచి పీకేశారు. విశ్రాంతి రూమ్ కు ఎక్కువగా వెళ్తున్నారనే కారణంతో మరొకరి ఉద్యోగం ఊడింది.

రెస్ట్ రూమ్ లో బ్రేకులు ఎక్కువ తీసుకుంటే జాబ్ ఊడుతుంది..
ఉద్యోగులకు భద్రత లేదు. చైనాలో (China) లీ అనే ఉద్యోగిని అధికంగా రెస్ట్ రూమ్ బ్రేకులు తీసుకుంటున్న కారణంగా ఆ సంస్థ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. దాదాపుగా 15 సంవత్స రాలుగా ఇక్కడ పనిచేస్తున్నాడు. ఎవరైనా మెసేజ్ పంపిస్తే ఆ మెసేజ్ లకు తక్షణం స్పందించడం అతని బాధ్యత. ఆ మెసేజ్ లకు లీ ఆలస్యంగా స్పందిస్తుండడంతో యాజమాన్యం అనుమానంతో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించింది. కేవలం రెండు మాసాల్లోనే 14సార్లు బాత్రూం బ్రేకులు తీసుకున్నట్లు తెలిసింది. ప్రతి బ్రేక్ కనీసం అరగంట, కొన్నిసార్లు ఏకంగా 4గంటల సమయం తీసుకున్నట్లు సంస్థ గుర్తించింది.
దీంతో అతనిని ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే లీ దీనిపై కోర్టును ఆశ్రయించాడు. అనారోగ్య కారణాల వల్ల ఎక్కువగా రూమ్ కు వెళ్లాల్సి వచ్చిందని ఆయన వాదించారు. అయినా కోర్టు అతని వాదనను అంగీకరించలేదు. ఎందుకంటే లీ తన ఆరోగ్యపరిస్థితిని ముందే సంస్థకు తెలియజేయలేదని, అతనిని తొలగించడం సబబే అని కోర్టు స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: