తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త. కరీంనగర్లోని(Karimnagar) శాతావాహన విశ్వవిద్యాలయం వేదికగా రేపు మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ ఉద్యోగ మేళాలో దేశవ్యాప్తంగా పేరొందిన సుమారు 50 సంస్థలు పాల్గొని వివిధ రంగాల్లో 5 వేలకుపైగా ఖాళీలను భర్తీ చేయనున్నాయి.
Read Also: IIIT Kurnool: 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ
ఐటీ నుంచి హెల్త్కేర్ వరకు విస్తృత రంగాలు
ఈ జాబ్ మేళాలో ఐటీ, ఫార్మా, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రిటైల్, ఎఫ్ఎంసీజీ, మేనేజ్మెంట్ వంటి అనేక రంగాలకు చెందిన కంపెనీలు రిక్రూట్మెంట్ నిర్వహించనున్నాయి. ఫ్రెషర్లు, అనుభవం ఉన్న అభ్యర్థులు ఇద్దరికీ ఇందులో అవకాశాలు లభించనున్నాయి.
అర్హతలు, ఎంపిక విధానం
బీటెక్, ఎంటెక్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, నర్సింగ్ చదివిన అభ్యర్థులు ఈ జాబ్(Karimnagar) మేళాకు అర్హులు. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా డైరెక్ట్ సెలెక్షన్ విధానంలో జరుగనుంది. పాల్గొనదలచిన వారు ముందుగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని, అవసరమైన సర్టిఫికెట్లతో హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు.
సంయుక్త నిర్వహణ
ఈ మెగా జాబ్ మేళాను శాతావాహన యూనివర్సిటీతో పాటు నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తోంది. యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: