ఐటీ (IT) రంగంలో ఉద్యోగాల కోత, లే ఆఫ్స్, నియామకాల తగ్గుదల వంటి అంశాలతో నిరుద్యోగుల్లో ఆందోళనలు నెలకొన్న సమయంలో ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తీపి కబురు అందించింది. ఈ ఏడాదిలో సుమారు 24,000 నుంచి 25,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది చేసిన నియామకాలతో పోలిస్తే ఇది దాదాపు 20 శాతం అధికం కావడం గమనార్హం.
Read Also: T20 World Cup: భారత్తో పాక్ మ్యాచ్ ఆడదు: షెహబాజ్

వేగంగా క్లయింట్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు అవుతున్నారు
ఈ ప్రకటనతో ఐటీ ఫ్రెషర్లలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.జెమిని, ఓపెన్ ఏఐ వంటి ప్లాట్ఫారమ్లతో జతకట్టి ఏఐ టూల్స్ ద్వారా ఎంట్రీ లెవల్ ఉద్యోగుల ఉత్పాదకతను పెంచుతున్నామని సీఈఓ రవి కుమార్ వెల్లడించారు. ఏఐ సహాయంతో కొత్త ఇంజనీర్లు గతంలో కంటే వేగంగా క్లయింట్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు అవుతున్నారని, అందుకే ఫ్రెషర్ల నియామకాన్ని పెంచుతున్నామని కంపెనీ స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: