భారతదేశంలోని ప్రముఖ సంపన్న వ్యాపారుల్లో అదానీ, అంబానీలు ఉన్నారు. గడచిన ఏడాది ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిని దాదాపు రూ.5,000 కోట్లు వెచ్చించి అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ క్రమంలో దేశవిదేశాల నుంచి అతిరుథులతో ముంబై నగరం కిక్కిరిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా 2025లో దేశంలోని మరో సంపన్నుడు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ పెళ్లి జరిగింది. ఈ క్రమంలో జీత్ అదానీ దివా షా వివాహం జరిగింది. అంబానీ మాదిరిగా అదానీ తన కుమారుడి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించలేదు. అదానీ తన కుమారుడి వివాహాన్ని సింపుల్గా నిర్వహించడమే కాకుండా రూ.10,000 కోట్లు విరాళంగా ప్రకటించారు. అయితే ఈ విరాళంలో ఎక్కువ భాగం ఆరోగ్య సంరక్షణ, ఎడ్యుకేషన్, నైపుణ్యాభివృద్ధికి ఖర్చు చేయాలని నిర్ణయించారు.

అదానీ ప్రకటించిన విరాళంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన ఆసుపత్రులు, వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకురావటంపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడైంది. గ్లోబల్ స్కిల్స్ అకాడమీలను అప్గ్రేడ్ చేయడానికి డబ్బు వినియోగించబడుతుందని వెల్లడైంది. అదానీ తన కుమారుడి వివాహానికి సంబంధించిన పెళ్లి ఫోటోలను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే జీత్ అదానీ వివాహానికి సన్నిహితులను ఆహానించనందుకు క్షమాపణలు సైతం కోరారు. అహ్మదాబాద్లో సాంప్రదాయ ఆచారాలు, శుభ్ మంగళ్ భావ్ తో ప్రియమైనవారి మధ్య జరిగిందని వెల్లడించారు.వివాహానికి ముందు అదానీ గ్రూప్ ‘మంగళ సేవా’ చొరవను ప్రారంభించింది.
ప్రతి సంవత్సరం కొత్తగా వివాహం చేసుకున్న 500 మంది వికలాంగ మహిళలకు ఆర్థిక సహాయం అందించబడుతుందని వెల్లడించారు. అదానీ గ్రూప్ ఇచ్చిన సమాచారం ప్రకారం కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అతనికి ప్రతి సంవత్సరం రూ.10 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది. జీత్ అదానీ కొత్తగా పెళ్లైన 25 మంది వికలాంగ మహిళలను, వారి భర్తలను స్వయంగా కలిసి ఆ జంటలకు ఆర్థిక సహాయం అందించారు.