ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ (Ali Khamenei) ప్రస్తుతం తీవ్రమైన భద్రతా ఆందోళనలతో ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్(Israel)తో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన భద్రత కోసం సీక్రెట్ బంకర్లో తలదాచుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ ఖమేనీపై దాడికి ప్రణాళికలు రచిస్తోందన్న ఊహాగానాలు పటిష్టంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం బహిరంగంగా కనిపించకపోవడం గమనార్హం.
సీజ్ఫైర్ మధ్యలోనే మకాం మార్చే ఆలోచన
ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య తాత్కాలికంగా సీజ్ఫైర్ అమలులో ఉన్నప్పటికీ, ఖమేనీకి తన ప్రాణాలపై ప్రమాదం ముప్పుగా కనిపిస్తున్నదని సమాచారం. విదేశీ ముఠాలు లేదా మోసాడ్ వంటి గూఢచార సంస్థలు ఆయనపై దాడికి సిద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఖమేనీ వేరే దేశానికి తాత్కాలికంగా మకాం మార్చాలని యోచిస్తున్నట్లు BBC నివేదిక పేర్కొంది. ఇది ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలకు మరింత ఉద్ధేగాన్ని తెచ్చే అవకాశముంది.
ఇరాన్ రాజకీయ స్థిరత్వంపై ప్రభావం?
ఖమేనీ వేరే దేశానికి వెళ్లిపోతే, అది ఇరాన్ రాజకీయ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఆయనే దేశంలో అత్యున్నత అధికారి కావడం, అన్ని కీలక నిర్ణయాలపై నియంత్రణ కలిగి ఉండటం వల్ల, అతని గైర్హాజరు రాజ్య పాలనలో అస్థిరతకు దారితీసే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో శత్రుదేశాలు మరింత బలంగా దూకుడుగా వ్యవహరించే ప్రమాదం ఉంది. ప్రపంచం మొత్తం ఈ పరిణామాలపై జాగ్రత్తగా నిఘా పెట్టి చూస్తోంది.
Read Also :Shashi Tharoor : టెర్రర్ గ్రూపులకు పాక్ స్వర్గధామం – శశి థరూర్