📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Crime: యెమన్ తీరంలో పడవ మునిగి 68మంది మృతి

Author Icon By Sharanya
Updated: August 4, 2025 • 11:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒక దేశంలో సమస్యలు వస్తే, అక్కడ నుంచి పక్కదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆరంభమైనప్పటి నుంచి అక్కడి ప్రజలు పక్కదేశాలకు పారిపోతున్నారు. కొందరు సముద్రమార్గంలో వలసల కోసం అక్రమంగా ప్రయాణం సాగించి, ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆఫ్రికా నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వస్తున్న శరణార్థులు, వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ యెమన్ (Yemen) తీరంలో మునిగిపోయింది. ఈ ఘోరవిషాద ఘటనలో 68మంది మరణించగా, మరో 74 మంది గల్లంతయ్యారని ఐక్యరాజ్యసమితి వలస సంస్థ (ఐఒఎం) వెల్లడించింది.

Crime: యెమన్ తీరంలో పడవ మునిగి 68మంది మృతి

12మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు

ఈ పడవలో మొత్తం 154మంది ప్రయాణికులు ఉన్నారని, వీరంతా ఇథియోపియన్లు అని ఐఓఎం యెమెన్ విభాగాధిపతి అబ్దుసత్తర్ ఎసోవ్ (Abdussattar Essov) తెలిపారు. ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున యెమన్లోని అబియాన్ ప్రావిన్స్ తీరంలో, గల్ఫ్ ఆఫ్ అడెన్ సమీపంలో చోటుచేసుకుంది. సముద్రంలో మునిగిన పడవలో 12మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని, వారిలో ఒకరు యెమెన్ దేశస్థుడు కాగా, మిగిలిన 11 మంది ఇథియోపియన్లు అని ఆయన వివరించారు.

లభ్యమైన 54మృతదేహాలు

మరణించిన వారిలో 54మంది మృతదేహాలు ఖన్ఫర్ జిల్లాతీరంలో లభ్యమయ్యాయని, మరో 14 మృతదేహాలను జింజిబార్ నగరంలోని ఆసుపత్రికి తరలించారని అధికారులు తెలిపారు. గల్లంతైనవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, బలమైన అలలకారణంగా గాలింపు చర్యలు కష్టంగా మారింది.

ప్రమాదకరమైన మార్గంలో పయనం

ఆఫ్రికాలోని హార్న్ ఆఫ్ ఆప్రియా ప్రాంతం నుండి గల్ఫ్ దేశాలకు చేరుకోవడానికి యెమన్ ఒక కీలకమైన ప్రాంతం, కానీ ప్రమాదకరమైన మార్గమని ఇక్కడి వారు చెబుతుంటారు. ఉపాధి, తిండి కోసం ఈ వలసదారులు తరచుగా రద్దీగా ఉండే, నాణ్యత లేని పడవల్లో ప్రయాణం చేస్తుంటారు. ఈ ప్రయాణంలో అనేకసార్లు పాణనష్టం జరుగుతుంది. తాజా ప్రమాదం ఈ మార్గంలో ఉన్న ప్రమాదాలను మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ విషాద ఘటన పట్ల ఐక్యరాజ్యసమితి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలను నివారించడానికి అంతర్జాతీయ సమాజం చరయలు తీసుకోవాలని, శరణార్థులకు, వలసదారులకు సురక్షితమైన మార్గాలను కల్పించాలని పిలుపునిచ్చింది.

అంతర్యుద్ధాలతో ప్రజల తిప్పలు

సరిహద్దు దేశాలతో తరచు యుద్ధాలు, అంతర్యుద్ధాలతో సామాన్యప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పక్కదేశాలతో వలసలతో వెళ్తుంటారు. ఏమాత్రం క్షేమకరం కాని పడవమార్గాలను ఎంచుకుంటున్నారు. పడవల్లో కూడా కెపాసిటీమించి ప్రయాణీకులను తీసుకెళ్తు తరచూ ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/green-card-2025-marriage-based-application-rules/international/525409/

68 migrants dead Boat tragedy Breaking News latest news sea accident Yemen boat tragedy Yemen refugee boat capsized

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.