📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest news: Yarlagadda Rajyalakshmi: అమెరికాలో అనారోగ్యంతో బాపట్ల విద్యార్థిని మృతి

Author Icon By Aanusha
Updated: November 8, 2025 • 9:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన బాపట్ల జిల్లా విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. ఈ ఘటన బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే, యార్లగడ్డ రాజ్యలక్ష్మి (Yarlagadda Rajyalakshmi) (23) అనే యువతి అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసింది. భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేసిన ఆమె ఆకస్మిక అనారోగ్యంతో కన్నుమూసింది.

Read Also: Actor Vishal: కోయంబత్తూర్‌ ఘటన.. నిందితులకు మరణశిక్ష విధించాలని విశాల్‌ డిమాండ్

రాజి (Yarlagadda Rajyalakshmi) రెండు మూడు రోజులుగా తీవ్రమైన దగ్గు, ఛాతి నొప్పితో బాధపడుతూ ఉంది. నవంబర్ 7 ఉదయం అలారం మోగినా లేవలేదు. దీంతో తోటి స్నేహితులు గమనించి చికిత్స అందించే లోపే ఆమె మృత్యువాత పడినట్టు తెలిసింది. దీంతో ఆమె కుటుంబం, స్నేహితులు శోకసముద్రంలో మునిగిపోయారు.

రాజి కుటుంబం ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని ఒక చిన్న గ్రామంలో వ్యవసాయం ఆధారంగా జీవిస్తోంది. వారికున్న భూమి, పశువులు వారిని నిలబెట్టే ఆర్థిక ఆధారం . రాజి మాత్రం చదువుతో కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న తపనతో అమెరికాకు వెళ్లింది.

Yarlagadda Rajyalakshmi

రాజ్యలక్ష్మి మృతి పట్ల సాంబశివరావు ప్రగాఢ సంతాపం

అయితే ఆ ఆశలు నెరవేరకముందే ఆమె తనువు చాలించింది.రాజి మృతదేహాన్ని స్వగ్రామం కారంచేడుకు తరలించేందుకు భారత ఎంబసి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ఆమె మృతదేహం ఇండియాకు చేరుకోనుంది.

రాజ్యలక్ష్మి మృతి పట్ల పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AP News Bapatla latest news Telugu News Telugu Student us Yarlagadda Rajyalakshmi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.