📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Wipro: ఉద్యోగులకు విప్రో షాక్.. ఆరుగంటల పని తప్పనిసరి

Author Icon By Rajitha
Updated: January 6, 2026 • 4:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశంలోని ప్రముఖ టెక్ సంస్థల్లో ఒకటైన విప్రో తన హైబ్రిడ్ వర్క్ విధానాన్ని మరింత కఠినతరం చేసింది. ఉద్యోగులు ఇకపై వారానికి కనీసం మూడురోజులు కార్యాలయానికి హాజరవ్వాలని.. ఆ రోజుల్లో కనీసం ఆరుగంటలు ఆఫీసులోనే పని చేయడం తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలను ఆమలు చేసింది. ఈ విధానం జనవరి 1 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇంతకుముందు ఉన్న సడలింపులతో కూడిన వర్క్-ఫ్రమ్-ఆఫీస్ విధానానికి ఇది భిన్నంగా ఉండడం గమనార్హం. బెంగళూరులో 2.34 లక్షలమంది ఉద్యోగులు బెంగళూరు (Bengaluru) కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విప్రోలో ప్రస్తుతం సుమారు 2.34 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. గత కొంతకాలంగా వారానికి మూడురోజులు ఆఫీసు హాజరు కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడు ఇన్-అవుట్ పంచ్ లమధ్య తప్పనిసరిగా ఆరు గంటల కార్యాలయంలో ఉండాలనే నిబంధనను జత చేశారు. ఇది భారతదేశంలో విప్రో అమలు చేస్తున్న హైబ్రిడ్ వర్క్ పాలసీలో ఒక కీలక మార్పుగా భావిస్తున్నారు.

Read also: Road accidents: వేగమా, జీవితమా! ఏది ముఖ్యం?

Wipro shocks employees

సెలువు బ్యాలెన్స్ పై ప్రభావం

ఈ కొత్త విధానం ఉద్యోగుల సెలవుల బ్యాలెన్స్ పై నేరుగా ప్రభావం చూపుతోంది. ఆఫీసులో నిర్ణయించిన సమయం పూర్తి చేయని ఉద్యోగుల సెలవుల ఖాతా నుంచి రోజులు తగ్గించబడుతున్నాయని పలువురు ఉద్యోగులు తెలిపారు. ముఖ్యంగా ఒక రోజు ఆఫీసులో ఆరు గంటల కంటే తక్కువ సమయం గడిపితే.. సగం రోజు సెలవు కోత విధిస్తున్నట్లు సమాచారం. దీంతో ఉద్యోగుల్లో కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అంతేకాక విప్రో అందిస్తున్న తాత్కాలిక రిమోట్ వర్క్ సౌకర్యాన్ని కూడా తగ్గించింది. గతంలో క్యాలెండర్ సంవత్స రానికి 15 రోజుల వరకు ఇంటి నుంచి పని చేసే అవకాశం ఉండగా, ఇప్పుడు దాన్ని 12రోజులకు పరిమితం చేసింది. ఈ రిమోట్ వర్క్ రోజులను వ్యక్తిగత సంరక్షణ, అనారోగ్యం లేదా కుటుంబ సంరక్షణ వంటి అవసరాలకోసం మాత్రమే వినియోగించుకోవాలని సంస్థ స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

hybrid work IT employees latest news Telugu News wipro Work From Office

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.