దేశంలో రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటాయని ప్రజలు భావిస్తారు. రష్యా నుంచి భారత్కు తక్కువ రేటుకు వస్తున్న ముడి చమురు దిగుమతులు తగ్గడమే ఇందుకు కారణమని సమాచారం.
Read Also: fake voters FIR : బెంగళూరులో ‘వోటు చోరీ’ కేసు నకిలీ ఓటర్ల కుట్రపై FIR నమోదు

దిగుమతి ఖర్చు పెరగనుంది
రష్యా ఆయిల్ సంస్థలపై అమెరికా విధిస్తున్న ఆంక్షలతో కొన్ని భారత కంపెనీలు ఇప్పటికే కొనుగోళ్లు ఆపేశాయి. US, పశ్చిమాసియా నుంచి వచ్చే ఆయిల్తో దిగుమతి ఖర్చు పెరగనుంది. దీంతో రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చని తెలుస్తోంది.
ఇతర దేశాలతో పోల్చితే చాలా తక్కువ ధరలకు రష్యా నుంచి భారత కంపెనీలు భారీగా ఆయిల్ దిగుమతి చేసుకున్నాయి. ఈ చౌక రేట్ల వలన దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు స్థిరంగా ఉండటానికి సహాయపడింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: