WHO Chief on Middle East War: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన దశకు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కేవలం ఆ ప్రాంతానికే కాకుండా ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
Read Also: Israel Iran conflict: ఇరాన్తో ప్రపంచానికి ముప్పు: ఐరోపాపై దాడులు చేసే ఛాన్స్ ఉందన్న నెతన్యాహు

అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు?
ఇరాన్లోని నతాన్జ్, ఇజ్రాయెల్లోని దిమోనా అణు కేంద్రాలపై దాడులు జరిగే అవకాశం ఉందన్న నివేదికలపై టెడ్రోస్ స్పందించారు. అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం అనేది మానవాళికి పెను ముప్పు అని ఆయన హెచ్చరించారు. ఇటువంటి చర్యల వల్ల ప్రజారోగ్యం, పర్యావరణంపై కోలుకోలేని విధంగా వినాశకరమైన ప్రభావం పడుతుందని ఆయన స్పష్టం చేశారు.యుద్ధం ద్వేషాన్ని పెంచుతుందని, సైనిక సంయమనం పాటించాలని, శాంతికి పిలుపునిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: