📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

అదానీపై కేసు.. స్పందించిన అమెరికా అధ్యక్ష భవనం

Author Icon By sumalatha chinthakayala
Updated: November 22, 2024 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వాషింగ్టన్‌: అమెరికాలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీపై కేసు నమోదుకావడం గ్లోబల్‌గా చర్చనీయాంశమైంది. సౌర విద్యుదుత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకోవడానికి భారత్‌లో రూ. 2,029 కోట్ల లంచాలు ఇచ్చారని, ఆ సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారని గౌతమ్‌ అదానీ సహా ఏడుగురిపై కేసు నమోదైంది. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ స్పందించింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని విశ్వాసం వ్యక్తం చేసింది.

వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరీన్‌ జీన్‌ పియర్‌ తన రోజువారీ మీడియా సమావేశంలో అదానీ గ్రూప్‌ వ్యవహారం గురించి స్పందించారు. అదానీపై కేసు నమోదైన విషయం మా దృష్టికి వచ్చింది. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంచ్‌ కమిషన్‌, న్యాయశాఖనే సరైన సమాచారం ఇవ్వగలదు. భారత్‌ -అమెరికా మధ్య సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉన్నాయి. అనేక అంశాలపై సహకారం అందించుకుంటున్నాం. మిగతా సమస్యల మాదిరిగానే ప్రస్తుత సంక్షోభాన్ని కూడా ఇరు దేశాలు అధిగమించగలవు. రెండు దేశాల మధ్య బంధం బలమైన పునాదిపై నిలబడిందని కరీన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

కాగా, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీతో పాటు సాగర్‌ అదానీ, వినీత్‌ ఎస్‌.జైన్‌, అజూర్‌ పవర్‌ సీఈఓ రంజిత్‌ గుప్తా తదితరులు లంచాల పథకానికి కీలక పాత్రధారులని ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ చట్టం (FCPA) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో గౌతమ్‌ అదానీ సహా మరికొందరిపై అమెరికా కోర్టు అరెస్ట్‌ వారంట్లు జారీ చేసినట్లు కొన్ని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. 20 ఏళ్లలో 2 బిలియన్‌ డాలర్ల లాభం కోసం సౌర విద్యుత్‌ కొనుగోలులో అధిక ధరలు పెట్టించి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత వర్గాలకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Adani Group Gautam Adani India - US White House

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.