అమెరికా హెచ్–1బీ (H-1B Visa) వీసాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలకు తాజాగా మరింత బలం చేకూరింది. భారతీయ–అమెరికన్ మాజీ దౌత్యవేత్త మహవష్ సిద్ధిఖీ(Mahavash Siddiqui) చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరోసారి చర్చకు తెచ్చాయి. నైపుణ్యాలు కలిగిన విదేశీ ప్రొఫెషనల్స్ కోసం జారీ చేసే హెచ్-1బీ వీసాలు గత కొంతకాలంగా వివాదాలకు కేంద్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, భారతీయులు నకిలీ అర్హత పత్రాలు, రాజకీయ ఒత్తిళ్లతో ఈ వీసాలను పొందుతున్నారని సిద్ధిఖీ ఆరోపించడం సంచలనం రేపింది.
Read also : Justice Suryakant: ఈ దేశానికి ప్రధాన న్యాయమూర్తి అవుతానని ఊహించలేదు: జస్టిస్ సూర్యకాంత్
భారతీయులకు జారీ చేసిన హెచ్-1బీ వీసాల్లో
2005–07 మధ్య చెన్నై అమెరికా కాన్సులేట్లో ఉద్యోగం చేసిన సిద్ధిఖీ, ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ కీలక అంశాలను వెల్లడించారు. అమెరికాలో సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో నైపుణ్యం కలిగిన యువత కొరత ఉన్నప్పటికీ, భారతీయులకు జారీ చేసిన హెచ్-1బీ వీసాల్లో 80–90% నకిలీవని ఆమె పేర్కొన్నారు. తాను చెన్నైలో పనిచేసినప్పుడు పలు దరఖాస్తుల్లో నకిలీ డిగ్రీలు, తప్పుడు పత్రాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయామని తెలిపారు. కొందరు భారతీయ నేతలు ఈ ఒత్తిళ్లకు కారణమని కూడా ఆమె ఆరోపించారు.
హైదరాబాద్ నుండి వచ్చిన దరఖాస్తుల్లో అనేక అనుమానాస్పద అంశాలు
చెన్నై కాన్సులేట్ నుంచే 51 వేలకుపైగా నాన్-ఇమిగ్రంట్ వీసాలు జారీ చేశామని, అందులో చాలా వరకు హెచ్-1బీ వీసాలే ఉన్నాయని ఆమె వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్(hyderabad) నుండి వచ్చిన దరఖాస్తుల్లో అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయని చెప్పారు. భారత్లో అవినీతి, లంచం సాధారణమైపోయిన వ్యవహారమని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ అధికారులే ఇంటర్వ్యూలు నిర్వహిస్తే అభ్యర్థులు రాకపోవడం, కానీ భారతీయ అధికారులు ఉంటే లంచాలతో ఎంపికలు జరగడం జరుగుతుందని వెల్లడించారు.
ఈ ఆరోపణల మధ్య, అమెరికా మాజీ ప్రతినిధి మరియు ఆర్థిక నిపుణుడు డాక్టర్ డేవ్ బ్రాట్ కూడా ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెన్నై నగరం నుంచే 2.2 లక్షల హెచ్-1బీ(H-1B Visa) వీసాలు జారీ కావడంపై ప్రశ్నలు లేవనెత్తారు. భారత్కు సంవత్సరానికి కేవలం 85 వేల హెచ్-1బీ వీసాల పరిమితి ఉన్నప్పటికీ, చెన్నై నుంచే ఆ పరిమితి కంటే 2.5 రెట్లు అధికంగా జారీ కావడం అనుమానాస్పదమన్నారు. భారతదేశం నుంచి 71% మంది హెచ్-1బీపై అమెరికాకు వస్తుండగా, చైనా నుంచి కేవలం 12% మాత్రమే ఉన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మొత్తం వ్యవహారంపై పారదర్శకత లోపిస్తున్నదంటూ తీవ్ర విమర్శలు చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :