📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: శాంతి స్థాప‌న కోసం భార‌త్‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తాం : షెహ‌బాజ్ ష‌రీఫ్

Author Icon By Sudha
Updated: May 16, 2025 • 10:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ (Shehbaz Sharif) .. భార‌త్‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. శాంతి స్థాప‌న కోసం భార‌త్‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఆ దేశంలోని పంజాబ్ (Punjab)ప్రావిన్సులో ఉన్న క‌మ్రా ఎయిర్ బేస్‌ (Kamra Air Base)ను విజిట్ చేసిన త‌ర్వాత ఆయ‌న మాట్లాడారు.

Pakistan: శాంతి స్థాప‌న కోసం భార‌త్‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తాం : షెహ‌బాజ్ ష‌రీఫ్

పాకిస్థాన్ ష‌ర‌తును తిర‌స్క‌రిస్తున్న భార‌త్
అక్క‌డ ఉన్న సైనికులు, మిలిట‌రీ ఆఫీస‌ర్ల‌ను ఆయ‌న క‌లిశారు. శాంతి స్థాప‌న కోసం పాకిస్థాన్ సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అయితే శాంతి చ‌ర్చ‌ల కోసం క‌శ్మీర్ స‌మ‌స్య‌ను ష‌రుతుగా పెట్టారాయ‌న‌.
కానీ భార‌త్ మాత్రం పాకిస్థాన్ ష‌ర‌తును తిర‌స్క‌రిస్తూనే ఉన్న‌ది. జ‌మ్మూక‌శ్మీర్‌, ల‌డాఖ్‌లు త‌మ భూభాగాల‌ని చెబుతూనే ఉన్న‌ది. పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో.. ఆయ‌న‌తో పాటు డిప్యూటీ ప్ర‌ధాని ఇషాక్ దార్‌, ర‌క్ష‌ణ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ అసిమ్ మునీర్, ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ జ‌హీర్ అహ్మ‌ద్ బాబిర్ సిద్దు ఉన్నారు.
ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య మే 10వ తేదీన కాల్పుల విమ‌ర‌ణ ఒప్పందం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. మే 6వ తేదీ రాత్రి ఇండియా ఆప‌రేష‌న్ సిందూర్ చేప‌ట్టింది. పెహల్గామ్ ఉగ్ర‌దాడిలో 26 మంది చ‌నిపోయిన ఘ‌ట‌న‌కు ప్ర‌తీకారంగా ఆప‌రేష‌న్ సిందూర్ నిర్వ‌హించారు. క‌మ్రా బేస్ క‌న్నా ముందు సియాల్‌కోట్‌లో ఉన్న ప‌స్రూర్ కంటోన్మెంట్‌ను కూడా పాక్ ప్ర‌ధాని విజిట్ చేశారు.

Read Also : Volcano Erupts : జపాన్లో పేలిన అగ్నిపర్వతం!

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Shehbaz Sharif Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today to establish peace: Today news We will hold talks with India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.