📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

Australia: మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

Author Icon By Vanipushpa
Updated: February 3, 2026 • 3:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. రోవిల్లేలోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని కొంతమంది దొంగలు కట్ చేసుకుని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగానే కాకుండా భారతీయ సమాజంలో కూడా కలకలం రేపుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.స్థానిక పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 12వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 12:50 గంటల సమయంలో) ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ఈ చోరీకి పాల్పడ్డారు. వారు చాలా ప్లాన్‌ ప్రకారం.. మెటల్ కట్ చేసే ‘యాంగిల్ గ్రైండర్’ మిషన్‌తో విగ్రహాన్ని పాదాల దగ్గర కట్ చేసి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ ద్వారా తెలుస్తోంది.

Read Also: Delhi: రేపు NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

Australia: మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

విగ్రహం మీద దాడులు జరగడం ఇది మొదటిసారి కాదు

ఈ విగ్రహం మామూలుది కాదు. భారత ప్రభుత్వం (ICCR) తరపున ఆస్ట్రేలియా(Australia)కు బహుమతిగా ఇచ్చినది. 2021లో అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ దీనిని ఎంతో ఘనంగా ఆవిష్కరించారు. అయితే ఈ విగ్రహం మీద దాడులు జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2021లో విగ్రహాన్ని ప్రతిష్టించిన కేవలం 24 గంటల్లోనే, కొందరు దుండగులు దీనిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈ చర్యను రెండు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇప్పుడు ఏకంగా విగ్రహాన్నే ఎత్తుకెళ్లడంతో దీని వెనుక ఏదైనా విద్వేషపూరిత కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఈ కాంస్య విగ్రహాన్ని ముక్కలుగా చేసి స్క్రాప్ వ్యాపారులకు అమ్మే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Gandhi memorial news India crime news Mahatma Gandhi statue vandalism public property damage statue theft news Telugu News Paper Telugu News Today trending news India vandalism incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.