H1B, H4(డిపెండెంట్స్) వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా (USA) ఇమ్మిగ్రేషన్ విభాగం ఇవాళ్టి నుంచి తనిఖీ చేయనుంది.ఈ నిర్ణయం ప్రధానంగా భారతీయ నిపుణులకు ఉపయోగపడే హెచ్-1బీ, హెచ్-4 వీసాలతో పాటు విద్యార్థులకు సంబంధించిన ఎఫ్ (F), ఎం (M), ఎక్స్ఛేంజ్ విజిటర్లకు సంబంధించిన జే (J) వీసాల దరఖాస్తుదారులకు వర్తిస్తుంది. అయితే విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. సోమవారం (డిసెంబర్ 15) నుంచి వీసా దరఖాస్తుదారుల ‘ఆన్లైన్ ఉనికి’ని సమీక్షించే ప్రక్రియ మొదలవుతుంది.
Read Also: Lionel Messi: వ్యాధిని జయించి ప్రపంచాన్ని గెలిచిన అసాధారణ ప్రయాణం
జాతీయ భద్రత
ఈ ‘వెట్టింగ్’ ప్రక్రియకు సహకరించే విధంగా.. హెచ్-1బీ, హెచ్-4తో సహా అన్ని వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా సెట్టింగ్లను ‘ప్రైవేటు’ నుంచి ‘పబ్లిక్’కు మార్చుకోవాలని అమెరికా (USA) విదేశాంగ శాఖ సూచించింది. ప్రతి వీసా నిర్ణయం కూడా జాతీయ భద్రత కోణంలోనే ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

“అమెరికాలోకి ప్రవేశించే వ్యక్తులు అమెరికన్లకు హాని కలిగించబోరని, దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించబోరని మేము విశ్వసించాలి. అందుకే వీసా దరఖాస్తుదారులు తమ విశ్వసనీయతను నిరూపించుకోవాలి” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వీసా జారీ ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా ఉంటామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: