US Consulate Karachi Attack: పాకిస్థాన్లోని కరాచీ నగరం యుద్ధరంగంగా మారింది. ఇరాన్ మత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి నిరసనగా వేలాది మంది ఆందోళనకారులు అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన భీకర ఘర్షణల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నిరసనకారులతో పాటు భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 🇵🇰 పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇప్పుడు పాకిస్థాన్ను చుట్టుముట్టాయి.
Read Also: Khamenei Death: మరణం వెనుక పక్కా స్కెచ్: తొలి దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం!
పాక్ అంతటా విస్తరించిన నిరసన జ్వాలలు
వివరాల్లోకి వెళితే, వందలాది మంది ఆందోళనకారులు కరాచీలోని యూఎస్ కాన్సులేట్ భవనం బయటి గోడను ధ్వంసం చేసి లోపలికి చొరబడేందుకు ప్రయత్నించారు. భవనంలోని అద్దాలను పగలగొట్టి, ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఓ గదికి నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించినా ఫలితం లేకపోయింది. దీంతో పాకిస్థాన్ పోలీసులు, అమెరికా భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు.
మరోవైపు, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని స్కర్డు పట్టణంలోనూ తీవ్ర నిరసనలు చోటుచేసుకున్నాయి. అక్కడ ఆందోళనకారులు ఐక్యరాజ్యసమితి (యూఎన్) కార్యాలయానికి నిప్పుపెట్టారు. ఇరాన్పై జరుగుతున్న దాడుల నేపథ్యంలోనే ఖమేనీ మరణం సంభవించిందని, దాని పర్యవసానంగానే మద్దతుదారుల ఆగ్రహం పాకిస్థాన్కు పాకిందని తెలుస్తోంది. స్థానిక పోలీసుల వివరాల ఆధారంగా రాయిటర్స్ వార్తా సంస్థ ఈ ఘటనలను నిర్ధారించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: