📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News : UN COP30: కాప్‌30 స‌ద‌స్సులో అగ్ని ప్ర‌మాదం..

Author Icon By Sudha
Updated: November 21, 2025 • 3:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బ్రెజిల్‌లోని బీల‌మ్ సిటీలో జ‌రుగుతున్న యూఎన్ కాప్‌30(UN COP30) స‌ద‌స్సులో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలో 21 మంది గాయ‌ప‌డ్డారు. వేల సంఖ్య‌లో ప్ర‌తినిధులు సుర‌క్షిత ప్రాంతానికి ప‌రుగులు తీశారు. గురువారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల స‌మ‌యంలో ఓ పెవిలియ‌న్‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. మంట‌లు వ్యాపించ‌డంతో స‌మీపంలో ఉన్న డెలిగేట్స్ ప్రాణాలు ద‌క్కించుకునే ప్ర‌య‌త్నం చేశారు. యూఎన్ కాప్‌30(UN COP30) స‌ద‌స్సు కోసం ఏర్పాటు చేసిన బ్లూ జోన్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మంట‌లు ద‌ట్టంగా వ్యాపించ‌డంతో అన్ని ఎగ్జిట్ గేట్ల నుంచి జ‌నం ప‌రుగులు తీవారు. సుమారు ఆరు గంట‌ల వ్య‌వ‌ధి త‌ర్వాత మ‌ళ్లీ స్టాల్స్‌ను ఓపెన్ చేశారు. 21 మందికి చికిత్స అందించిన‌ట్లు బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ పేర్కొన్న‌ది. పొగ పీల్చ‌డం వ‌ల్ల 19 మంది అస్వ‌స్థుల‌య్యారు. కానీ ఎవ‌రికీ కాలిన గాయాలు కాలేదు.

Read Also: http://Delhi Blast: పాక్ నుంచి బాంబు తయారీ వీడియోలు.. వెలుగులో ఉగ్ర డాక్టర్ కుట్రలు

UN COP30

అగ్నిప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో యూఎన్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెర్ర‌స్ అక్క‌డే ఉన్నారు. ఆయ‌న్ను సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు. భార‌త ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద‌ర్‌ యాద‌వ్ కూడా ప్ర‌మాదం జ‌రిగిన ప్ర‌దేశంలో ఉన్నారు. మంత్రి భూపేందర్‌తో పాటు భార‌త ప్ర‌తినిధుల బృందం సుర‌క్షిత ప్రాంతానికి వెళ్లింది. భార‌త బృందం సుర‌క్షితంగా ఉన్న‌ట్లు మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్ తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News climate summit environmental news fire incident global conference latest news Telugu News UN COP30

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.