ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో (UNSC) భారత్కు శాశ్వత సభ్యత్వం రావాలని భారత్ ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఆ ప్రయత్నానికి అంతర్జాతీయంగా మరింత బలం చేకూరింది. తాజాగా బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ (British Prime Minister Keir Starmer) భారత పక్షాన తన మద్దతును బహిరంగంగా ప్రకటించారు.
Gaza Peace Deal : శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన ఇజ్రాయెల్-హమాస్
న్యూఢిల్లీ (New Delhi) లోని రాజ్భవన్లో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) తో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.భారత్ సాధిస్తున్న అద్భుతమైన అభివృద్ధిని, అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించగల సామర్థ్యాన్ని స్టార్మర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
“భద్రతా మండలిలో భారత్ తన హక్కుగా పొందాల్సిన స్థానాన్ని దక్కించుకోవడాన్ని మేము చూడాలనుకుంటున్నాం” అని ఆయన అన్నారు. భారత్ శాశ్వత సభ్యత్వానికి ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, రష్యా వంటి దేశాలు మద్దతు తెలుపగా,

దశాబ్ద కాలంలోనే అతిపెద్ద వాణిజ్య ప్రతినిధి
ఇప్పుడు యూకే (UK) కూడా అదే బాటలో నిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.తన భారత పర్యటన ఉద్దేశాన్ని వివరిస్తూ, గత దశాబ్ద కాలంలోనే అతిపెద్ద వాణిజ్య ప్రతినిధి బృందంతో తాను ఇక్కడికి వచ్చినట్లు స్టార్మర్ (Keir Starmer) తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య భాగస్వామ్యాన్ని రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో భారత్, యూకేలు ప్రపంచ నాయకులుగా కలిసి నిలుస్తున్నాయని చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా యూకేలో బాలీవుడ్ చిత్రాల నిర్మాణానికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరిందని కూడా ఆయన ప్రకటించారు.ఇదే సమయంలో, గాజాలో శాంతి ఒప్పందం (Peace agreement in Gaza) మొదటి దశకు చేరుకోవడం పట్ల స్టార్మర్ (Keir Starmer) హర్షం వ్యక్తం చేశారు.
ఇది ఎంతో ఉపశమనం కలిగించే క్షణమని, ఈ శాంతి ప్రణాళిక పూర్తిస్థాయిలో అమలు కావడానికి యూకే మద్దతుగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: