Tulsi Gabbard: గత 19 రోజులుగా ఇజ్రాయెల్, అమెరికా బలగాలు భీకర దాడులు చేస్తున్నప్పటికీ, ఇరాన్ తన పోరాటాన్ని ఆపలేదు. సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సహా కీలక నేతలు మరణించినా, అక్కడి ప్రభుత్వ యంత్రాంగం ఇంకా బలంగానే ఉందని అమెరికా నిఘా విభాగం చీఫ్ తులసి గబ్బార్డ్ విశ్లేషించారు.
Read Also: Iran Warns Gulf Countries: గల్ఫ్ దేశాలకు ఇరాన్ భీకర హెచ్చరిక!
పాలన బలహీనపడినా.. పునాదులు భద్రం
‘ఇరాన్ నాయకత్వం, సైనిక సామర్థ్యాలపై జరిగిన దాడుల కారణంగా అక్కడి పాలన చెక్కుచెదరకపోయినా.. చాలా వరకు బలహీనపడిందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి’ సెనేట్ విచారణలో ఆమె తెలిపారు.ఈ సందర్భంగా అమెరికాకు అత్యంత భారీ అణు ముప్పును కలిగించే దేశాలలో ఇరాన్, చైనా, రష్యా, ఉత్తర కొరియాలతో పాటు పాకిస్థాన్ కూడా ఒకటని గబ్బార్డ్ పేర్కొన్నారు. ఈ దేశాలు అణ్వాయుధాలు, సంప్రదాయ వార్హెడ్లు రెండింటినీ మోయగల అధునాతన క్షిపణి ప్రయోగ వ్యవస్థలను చురుకుగా అభివృద్ధి చేస్తున్నాయని ఆమె వెల్లడించారు.
‘‘రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్, పాకిస్థాన్లు అణ్వాయుధాలు, సంప్రదాయ పేలోడ్లతో కూడిన అనేక రకాల కొత్త, అధునాతన, లేదా సాంప్రదాయ క్షిపణి ప్రయోగ వ్యవస్థలపై పరిశోధనలు, అభివృద్ధి చేస్తున్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవి మన అమెరికాను వాటి పరిధిలోకి తీసుకువస్తాయి’ అని గబ్బార్డ్ అన్నారు. అంతేకాదు, రష్యా, చైనాలతో ఉత్తర కొరియా సహకారాన్ని పెంచుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.గత ఏడాది జూన్లో అమెరికా ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ధ్వంసం చేసిందని, పునర్నిర్మాణానికి టెహ్రాన్ చేసిన ప్రయత్నాలేవీ తాము గమనించలేదని కూడా ఆమె అన్నారు. లిఖితపూర్వకంగా ఇచ్చిన వార్షిక ముప్పు అంచనాలో ఈ వివరాలను ఆమె పంచుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: