అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Trump Vs Musk) మధ్య జరిగిన వివాదం కొత్త మలుపు తిరిగింది. మస్క్ తన గత వ్యాఖ్యలపై క్షమాపణలు కోరడాన్ని ట్రంప్ స్వాగతించారని అమెరికా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ (Caroline) వెల్లడించారు. ఆమె ప్రకారం, “ఎలాన్ మస్క్ చేసిన ప్రకటనను అధ్యక్షుడు స్వాగతంగా స్వీకరించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది” అని తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వ కాంట్రాక్టులపై స్పష్టత లేదు
ఎలాన్ మస్క్ కు ప్రభుత్వం తిరిగి కాంట్రాక్టులు ఇస్తుందా? అనే ప్రశ్నపై స్పందించిన కరోలిన్, ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొన్నారు. మస్క్ క్షమాపణ తర్వాత సంబంధాలు మెరుగవుతున్నా, ప్రభుత్వ కాంట్రాక్టుల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. ఇది ట్రంప్–మస్క్ సంబంధాల్లో కొత్త ఒరవడి మొదలైనట్లు అనిపిస్తున్నప్పటికీ, అధికారికంగా సహకారం ప్రారంభమవుతుందా లేదా అనేది మరికొద్దిరోజుల్లో తేలనుంది.
వివాదానికి తెరపడే సూచనలు
మస్క్–ట్రంప్ మధ్య గతంలో ఏర్పడిన వ్యక్తిగత విమర్శలు, వ్యాపారపరమైన విభేదాలు పెద్ద దుమారాన్ని రేపాయి. అయితే తాజాగా క్షమాపణలతో మాటల తూటాలు తగ్గినట్లు కనిపిస్తోంది. మస్క్ ప్రభుత్వం, దేశ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేస్తున్నట్లు అభిప్రాయపడతున్నారు. ఈ పరిణామాలు అమెరికా రాజకీయాలు, టెక్ పరిశ్రమపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.
Read Also : CRS : ఏపీలో జననాలు తగ్గి, మరణాలు పెరుగుతున్నాయ్